Amazon Great Freedom Festival Sale: ఆ వస్తువులు కేవలం రూ.49 మాత్రమే.. అమెజాన్ ఫ్రీడం సేల్ లో పిచ్చెక్కించే ఆఫర్లు!

ఈ నెల 6 నుంచి గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది అమెజాన్. ఈ సేల్ లో ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ తో వివిధ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇంకా కేవలం రూ.49 ప్రారంభ ధరతోనే అనేక ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయని అమెజాన్ తన సేల్ పేజీలో పేర్కొంది.

New Update
Amazon Great Freedom Festival Sale: ఆ వస్తువులు కేవలం రూ.49 మాత్రమే.. అమెజాన్ ఫ్రీడం సేల్ లో పిచ్చెక్కించే ఆఫర్లు!

Amazon Sale: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సారి భారీ సేల్ ను ప్రకటించింది. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఆగస్టులోనూ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 6 నుంచి.. అంటే మరో 4 రోజుల్లో ఈ సేల్ ప్రారంభించనుంది అమెజాన్. ఏడాదికి ఓ సారి జరిగే ఈ మెగా సేల్ కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా భారీ ఆఫర్లు ఉంటాయని అమెజాన్ తన సేల్ పేజీలో పేర్కొంది. ఆఫర్లతో పాటు SBI కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చని అమెజాన్ ప్రకటించింది.

Amazon Great Freedom Festival Sale

ఈ సేల్ లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు, హోం అప్లియెన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ తదితర వస్తువులపై బారీ ఆఫర్లు ఉండనున్నాయని అమెజాన్ (Amazon) తన సేల్ పేజీలో తెలిపింది. మీరు స్మార్ట్ వాచ్ లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఈ సేల్ మీకు బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు.

publive-image

కేవలం రూ.999కే ఈ సేల్ లో స్మార్ట్ వాచ్ ను సొంతం చేసుకోవచ్చు.హోమ్, కిచెన్ అప్లియెన్సెస్ కేవలం రూ.79 ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చు. ట్రావెల్ బుకింగ్స్ ను సైతం 40 శాతం వరకు డిస్కౌంట్ తో చేసుకోవచ్చు. బుక్స్, టాయ్స్, గేమింగ్ వస్తువులను సైతం 49 రూపాయల ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చు.

publive-image

దస్తులు, ఫుట్ వేర్, బ్యూటీ వస్తువులపై సైతం ఎప్పుడూ లేనంతగా ఈ సేల్ లో ఆఫర్లు ఉంటాయని అమెజాన్ తెలిపింది. స్మార్ట్ టీవీలపై ఈ సేల్ లో సూపర్ ఆఫర్లు ఉండనున్నాయని సేల్స్ పేజీని పరిశీలిస్తే స్పష్టం అవుతోంది. కేవలం రూ.6999 ప్రారంభ ధరతోనే స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు.

Also Read: ఫాస్టాగ్ న్యూ రూల్స్ అమలులోకి.. మీ కారు కోసం ఏమి చేయాలి? తెలుసుకోండి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఆర్బీఐ ఎఫెక్ట్.. ఈ కంపెనీల షేర్లు భారీగా పతనం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల ప్రభావం గోల్డ్ లోన్ కంపెనీలపై భారీగా పడింది. ఆర్బీఐ ప్రకటించిన వెంటనే ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.

New Update
Muthoot finance Shares

Muthoot finance Shares Photograph: (Muthoot finance Shares)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. అయితే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో గోల్డ్ లోన్ కంపెనీలపై భారీ ఎఫెక్ట్ పడింది. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు అయితే దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఆర్బీఐ కీలక ప్రకటన చేసిన తర్వాత..

బంగారు ఆభరణాలపై బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీ వంటి నియంత్రిత సంస్థలు గోల్డ్ లోన్లు ఇస్తాయని గవర్నర్ తెలిపారు. అయితే వ్యక్తిగత సంస్థల రిస్క్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోల్డ్ లోన్ నిబంధనలను జారీ చేస్తామని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల గోల్డ్ లోన్ కంపెనీల షేర్లపై ప్రభావం పడింది.

ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

ముత్తూట్ ఫైనాన్స్ కోసం బంగారు రుణాలు కంపెనీ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులలో 98 శాతంగా ఉన్నాయి. అదే సమయంలో మణప్పురం ఫైనాన్స్‌లో 50 శాతం, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో 21 శాతం ఏయూఎం గోల్డ్ లోన్స్ నుండి వస్తాయి. ఈ షేర్లు ధరలు 10 శాతం క్షీణించి రూ.2,063 వద్ద ముగిసింది. అదేసమయంలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు ధర 6.66 శాతం క్షీణించి రూ.311.25 వద్ద ముగిసింది. 

Advertisment
Advertisment
Advertisment