Telangana: నాన్‌వెజ్ తెచ్చాడని విద్యార్థిని బహిష్కరించిన స్కూల్ ప్రిన్సిపాల్

ఉత్తరప్రదేశ్‌లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థి క్లాసులోకి నాన్‌ వెజ్‌ తీసుకొచ్చాడన్న కారణంతో స్కూల్‌ ప్రిన్సిపాల్ అతడిని బహిష్కరించాడు. సెప్టెంబర్ 5న టీచర్స్‌ డే రోజునే ఈ ఘటన జరిగింది. దీంతో ఈ వ్యవహారంపై అధికారులు విచారణకు ఆదేశించారు.

New Update
Telangana: నాన్‌వెజ్ తెచ్చాడని విద్యార్థిని బహిష్కరించిన స్కూల్ ప్రిన్సిపాల్

పాఠశాల అంటే విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే చోటు. అక్కడ ఎలాంటి బేధాభావాలు లేకుండా, వివక్ష చూపించకుండా అందరూ సమానులే అని విద్యార్థులకు బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. కానీ పాఠశాలలోనే విద్యార్థుల మధ్య హిందూ-ముస్లిం భావనను సృష్టించడం దారుణం. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ విద్యార్థి క్లాసులోకి నాన్‌ వెజ్‌ తీసుకొచ్చాడన్న కారణంతో స్కూల్‌ ప్రిన్సిపాల్ అతడిని బహిష్కరించాడు. సెప్టెంబర్ 5న టీచర్స్‌ డే రోజునే ఈ ఘటన జరిగింది. స్కూల్‌ ప్రిన్సిపాల్, విద్యార్థి తల్లి మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లడంతో దీనిపై విచారణకు ఆదేశించారు.

Also Read: వరదల ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థిక సాయం

ఆ వీడియోలో గమనిస్తే.. హిల్‌టాన్ కాన్వెంట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ తన గదిలో ఆ విద్యార్థి తల్లితో వాగ్వాదానికి దిగాడు. మీ అబ్బాయి నిత్యం నాన్‌ వెజ్‌ ఆహారాన్ని క్లాస్‌లోకి తీసుకొస్తున్నాడని చెప్పాడు. మిగతా విద్యార్థులందరిని కూడా నాన్‌ వెజ్‌ తినేలా చేయించి అందరిని ఇస్లాం మతంలోకి మార్చాలని చూస్తున్నాడని ఆరోపించారు. అంతేకాదు ఆ విద్యార్థి హిందూ ఆలయాలని కూల్చాలని అనుకుంటున్నాడని అన్నాడు. మీ అబ్బాయికి ఇలాంటివే నేర్పిస్తున్నారా అని మండిపడ్డారు.

మరోవైపు ప్రిన్సిపాల్ చేసిన వ్యాఖ్యలను ఆ విద్యార్థి తల్లి ఖండించారు. గత మూడు నెలల నుంచి తన కొడుకు క్లాస్‌లోని విద్యార్థులు హిందూ-ముస్లిం విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఆ రోజు తరగతి గదిలో ఉదయం నుంచి కూడా తన అబ్బాయిని కూర్చోనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చివరికి ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌.. మీ అబ్బాయికి ఇకనుంచి ఇక్కడ పాఠాలు చెప్పమని.. స్కూల్ నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూల్‌ ప్రిన్సిపాల్‌పై నెటీజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాన్‌ వెజ్‌ తెచ్చుకున్నంత మాత్రనా విద్యార్థిని మతపరంగా భేదం చూపించడం ఏంటని తిట్టిపోస్తున్నారు.

Also Read: కర్ణాటకలో కరోనా స్కామ్.. రూ.1000 కోట్లు స్వాహా !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment