Maharashtra : గ్లోవ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

మహారాష్ట్రలోని వలుజ్‌ ఛత్రపతి శంభాజీనగర్‌ హ్యాండ్‌ గ్లవ్స్‌ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంటల్లో ఆరుగురు సజీవదహనం అవగా.. మరో 15 మంది తీవ్రంగా యపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అగ్నిమాపక అధికారి మోహన్ ముంగ్సే తెలిపారు.

New Update
Maharashtra : గ్లోవ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

Maharashtra : మహారాష్ట్రలో భారీ అగ్ని (Fire accident) ప్రమాదం జరిగింది. హ్యాండ్‌ గ్లవ్స్‌ (Hand gloves) ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే ఆరుగురు సజీవదహనం అయ్యారు. భారీగా ఆస్తినష్టం జరగడంతోపాటు పలువురు తీవ్రంగా గాయపడ్డట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు.

ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో ఔరంగాబాద్‌ సమీపంలోని వలుజ్‌ ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అగ్నిమాపక అధికారి మోహన్ ముంగ్సే తెలిపారు. వలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తమకు సమాచారం అందిందగానే పోలీసు అధికారులతో అక్కడికి చేరుకున్నామని, ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయిందని చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో లోపల ఆరుగురు చిక్కుకున్నారని స్థానికులు చెప్పడంతో తమ సిబ్బంది ఫ్యాక్టరీ లోపలికి ప్రవేశించి మృతదేహాలను వెలికితీశారని తెలిపారు. అయితే, అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 10 -15 మంది నిద్రిస్తున్నట్లు బాధితులు తెలిపారు. కొందరం తప్పించుకోగలిగామని, మిగిలిన వారు మంటల్లో చిక్కుకొని మరణించినట్లు వాపోయారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఇది కూడా చదవండి : Jayaprada: నటి జయప్రద మిస్సింగ్‌ ..వెతుకుతున్న పోలీసులు!

ఇక మంటలు ఎందుకు, ఎలా చెలరేగాయి అనే సమాచారం ఇంకా తెలియరాలేదు. మంటలు చెలరేగిన సమయంలో ఫ్యాక్టరీలో ప్రజలు నిద్రిస్తున్నారని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి తెలిపారని పోలీసులు వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

డాక్టర్ల నిర్లక్ష్యం.. సగం కాన్పు చేయడంతో..?

డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ పసికందు తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన వనపర్తిలో జరిగింది. ఓ మహిళకు డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విఫలం కావడంతో పసికందును రెండు భాగాలుగా కోసి బయటకు తీశారు.

New Update
Wanaparthy crime

Wanaparthy crime Photograph: (Wanaparthy crime)

ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ పసికందు తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. తల్లి ప్రాణాలను కాపాడేందుకు చివరకు ప‌సికందు త‌ల‌, మొండెంను వేరు చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రఘడ్ గ్రామానికి చెందిన అనిత అనే గర్భిణీకి నెల‌లు నిండాయి.

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

ప్రసవం చేస్తుండగా ఆరోగ్యం క్షీణించి..

ఈ క్రమంలో ఆమెను అమ‌ర‌చింత ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లు లేకపోవడంతో స్టాఫ్ న‌ర్సు డెలివరీ చేయడానికి ప్రయత్నించగా విఫలమైంది. దీంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ప్రసవం చేస్తుండగా.. పిండం వెనుక భాగం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

దీంతో డాక్టర్లు చేతులు ఎత్తేశారు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తల్లిని కాపాడే ప్రయత్నంలో ప్రైవేట్ వైద్యులు పసికందు తల మొండెం రెండు భాగాలుగా కోసి బయటకు తీశారు. తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన పసికందును చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 

ఇది కూడా చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యులు సరిగ్గా పనిచేస్తే ఇలా జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisment
Advertisment
Advertisment