Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

వనపర్తి జిల్లా కొత్తపేట వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

New Update
Gujarat: పండుగ వేళ విషాదం.. 10 మంది మృతి!

Wanaparthy District : వనపర్తి జిల్లా(Wanaparthy District) కొత్తపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కొత్తపేట జాతీయ రహదారి(National Highway) పై ఓ కారు వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పడంతో చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

Also Read: బీఆర్ఎస్ నాయకులకు సాంకేతిక అవగాహన లేదు.. ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

గాయాలపాలైనవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో ముగ్గురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. అయితే మృతి చెందిన ఐదుగురిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు అబ్దుల్‌ రహమాన్‌ (62), సలీమా జీ (85), చిన్నారులు వాసిర్‌ రవుత్‌ (7 నెలలు), బుస్రా (2), మరియా (5)గా గుర్తించారు. బళ్లారి నుంచి హైదరాబాద్‌(Ballari - Hyderabad) కు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Also Read: కాంగ్రెస్‌లోకి మరో బీజేపీ నేత?

Advertisment
Advertisment
తాజా కథనాలు