Indian Navy : సముద్ర జలాల్లో 110 మందిని రక్షించాం : భారత నావీ

ఎర్రసముద్రం, అరేబియా మహాసముద్రంలో గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జరకు 90కి పైగా దాడులు జరగగా.. మొత్తం 110 మందిని రక్షించామని ఇండియన్ నావీ తెలిపింది. అందులో 45 మంది భారతీయులు, 65 మంది విదేశీయులు ఉన్నారని పేర్కొంది.

New Update
Indian Navy : సముద్ర జలాల్లో 110 మందిని రక్షించాం : భారత నావీ

Indian Navy Saved : ఈ మధ్యకాలంలో.. ఎర్రసముద్రం(Red Sea), అరేబియా మహాసముద్రం(Arabian Ocean) లో వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన సందర్భాలున్నాయి. అయితే ఈ క్రమంలో దాడులకు గురవుతున్న విదేశీ నౌకలకు ఇండియన్ నేవీ(Indian Navy) రక్షణగా ఉంటోంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు 90కిపైగా దాడులకు జరగగా.. మొత్తం 110 మంది ప్రాణాలు కాపాడామని భారత నావీ తెలిపింది. ఇక వివరాలోల్లోకి వెళ్తే.. నేవీ చీఫ్‌ అడ్మిరల్ ఆర్‌. హరికుమార్ వాణిజ్య నౌకల దాడులకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యాలు చేశారు.

Also Read : ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు: ఎస్‌. జై శంకర్

'గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు సముద్ర జలాల్లో 90కి పైగా దాడులు జరిగాయి. ఇందులో క్షిపణులు, డ్రోన్లు(Drones), సముద్రపు దొంగల దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే తాము నిర్వహిస్తున్న ఆపరేషన్లలో 5 వేల మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. 21 నౌకలకు రంగంలోకి దింపాం. గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో జరిగిన ఘటనలపై కూడా స్పందించాం. మొత్తంగా 110 మందిని రక్షించి వారి ప్రాణాలు కాపాడం. వాళ్లలో 45 మంది భారతీయులు.. మరో 65 మంది విదేశస్థులు ఉన్నట్లు' హరికుమార్ తెలిపారు.

ఇటీవల సోమాలియా సముద్రపు దొంగల చేతిలో ఓ వాణిజ్య ఓడ హైజాక్‌కు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమాచారం తెలుసుకొని రంగంలోకి దిగిన భారత నావీ.. ఆ వాణిజ్య నౌకను రక్షించింది. మెరైన్‌ కమాండోలు కిందికి దిగి మొత్తం 17 మంది బందీలను విడిపించారు. అలాగే 35 మంది సముద్రపు దొంగలను తమ అదుపులోకి తీసుకున్నారు. భారత నావీ చేసిన సాహసానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఈ 35 మంది సముద్రపు దొంగలను భారత నేవీ ఈరోజు (శనివారం) ఇండియాకు తీసుకొచ్చి ముంబయి పోలీసు(Mumbai Police) లకు అప్పగించింది.

Also Read : సద్గురుపై పాము దాడి.. ఒకేసారి మూడు కాట్లు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump: ఆ దేశం అస్సలు వెళ్లకండి.. అమెరికన్లకు ట్రంప్‌ హెచ్చరిక

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది.

New Update
Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది. బహమాస్ అనేది కామన్వెల్త్ దేశాల్లో ఒక స్వతంత్ర దేశం. పర్యాటక పరంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య అక్కడికి వెళ్లే పర్యటకులపై కొందరు దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

అంతేకాదు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఆఖరికీ హత్యలకు కూడా చేయడానికి వెకాడటం లేదు. అలాగే బహమాస్ సముద్ర జలాల్లో షార్క్‌ దాడుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి వెళ్లకూడదని ట్రంప్ సర్కార్ ప్రజలకు సూచనలు చేసింది.అక్కడ అద్దె గదుల్లో కూడా ఉండటం సురక్షితం కాదని చెపింది. ప్రైవేట్ సెక్యూరిటీ లేని ప్రాంతంలో బస చేయడం మంచిది కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్చి 31న ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

పర్యాటకులు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసి ఆయుధాలు, తుపాకులు తీసుకెళ్లడం చట్టారీత్యా నేరమంటూ హెచ్చరించింది. రూల్స్‌ ఉల్లంఘిస్తే ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని తెలిపింది. అరెస్టులు, జైలుశిక్ష, జరిమానా విధిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

trump | telugu-news | rtv-news | usa

Advertisment
Advertisment
Advertisment