Texas : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి! అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నెంబర్ 75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. వారిలో ముగ్గురు హైదరాబాద్ వాసులు ఉన్నారు.హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. By Bhavana 04 Sep 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Car Accident In Texas : అమెరికా (America) లోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నెంబర్ 75లో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో నలుగురు భారతీయులు మృతి చెందారు. వీరిలో ఒకరు తమిళనాడు (Tamilnadu) వాసి కాగా..మిగిలిన ముగ్గురు హైదరాబాద్ (Hyderabad) కు చెందినవారు. ఈ ప్రమాదం శుక్రవారమే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వారిలో హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. కార్ పూలింగ్ ద్వారా ఈ నలుగురు బెన్టోన్విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారని తెలిపారు. వరుసగా 5 వాహనాలు ఒకదానినొకటి అతివేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. డల్లాస్ లో బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని, ఫరూఖ్ ఈ కారులో ఎక్కినట్లు సమాచారం. వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలు అంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోవడంతో కార్ పూలింగ్ యాప్ లో నమోదైన వివరాల ఆధారంగా ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. Also Read: 10 వేల అడుగుల ఎత్తు నుంచి పడి..ఆడి ఇటలీ అధినేత మృతి! #texas #hyderabad #car-accident #america #tamilnadu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి