Zomato : కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంచిన జొమాటో

ప్రముఖ ఫుడ్ డెలవరీ సంస్థ జోమాటో బాదుడుకు సిద్ధమైంది. ఇకపై తమ దగ్గర ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఛార్జీలు ఎక్కువే చెల్లించాలి అంటోంది. కొంతకాలం క్రితం జొమాటో ప్రవేశపెట్టిన ప్లాట్ ఫాం ఫీజును ఇప్పుడు మరింత పెంచేస్తోంది.

New Update
Zomato: శాకాహారం ఆర్డర్‌ ఇస్తే..మాంసాహారం..క్షమాపణలు చెప్పిన జొమాటో!

Food Order Charges Are Getting High : ప్రస్తుతం ఫుడ్ డెలవరీ యాప్స్(Food Delivery Apps), సంస్థలకు భలే గిరాకీ ఉంది. కోవిడ్(Covid) తరువాత నుంచి ఇది మరింత పెరిగిపోయింది. నిజం చెప్పాలంటే ఇళ్ళల్లో ఆహారం వండుకోవడం తక్కువ ఆర్డర్ పెట్టుకోవడం ఎక్కువ అయినట్టుంది పరిస్థితి. ముఖ్యంగా స్విగ్గీ(Swiggy), జొమాటో(Zomato) లకు అయితే విపరీతమైన డిమాండ్ , క్రేజ్ ఉంది. జీఎస్టీలు, డెలివరీ ఫీజు, ప్లాట్ ఫాం ఫీజు ఇలా ఎనని పెట్టినా వీటి క్రేజీ మాత్రం తగ్గడం లేదు. మెట్రో నగరాల్లో ఈ డిమాండ్ ఇంకా కాస్త ఎక్కువే ఉంది. అయితే ఈ క్రేజ్‌కు తగ్గట్టే ఫుడ్ డెలివరీ సంస్థలు చార్జీలు కూడా పెంచేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా జొమాటో మరోసారి ఛార్జీలను పెంచి వినియోగదారులకు షాక్ ఇస్తోంది.

ప్లాట్ ఫాం ఫీజు పెరిగింది...

కొంతకాలం క్రితమే స్విగ్గీ, జొమాటోలు ప్లాట్ ఫాం ఫీజును ప్రవేశపెట్టాయి. జీఎస్టీల్లాంటివి కాకుండా ఇది అదనపు ఫీజు. ఇప్పుడు దీన్నే మళ్ళీ పెంచుతోంది జొమాటో. అది కూడా ఏకంగా 25శాతం. ఏప్రిల్ 20 నుంచి ఇది అమలు అవుతుంది. దీన్ని బట్టి ఒక ఆర్డర్‌పై ప్లాట్‌ఫాం ఫీజు రూ. 5 వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, లక్నో ల్లాంటి ప్రధాన నగరాల్లో ఈ ప్లాట్‌ఫాం ఫీజు పెంచుతున్నామని చెబుతోంది. అంతకుముందు ఇదే ఏడాది మొదట్లో అంటే జనవరిలో జొమాటో ప్లాట్‌ఫాం ఫీజును రూ. 3 నుంచి 4 కు పెంచిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా జొమాటో ఈ ఫుడ్ ఫ్లాట్ ఫాం ఛార్జీని ఆగస్టు 2023 నుంచి వసూలు చేయడం ప్రారంభించింది. మొదట్లో ఈ ఛార్జీలు 2 రూ.లు ఉండేవి. తరువాత దీన్ని 3 నుంచి 4 రూ.లకు పెంచింది. ఇప్పుడు అది కాస్తా 5 రూ. అయింది. మరోవైపు ఇక జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం బ్లింకిట్.. ఆర్డర్‌పై రూ. 2 ప్లాట్‌ఫాం ఫీజు వసూలు చేస్తోంది.

ఫుడ్ డెలివరీకి ఉన్న డిమాండ్‌ను స్విగ్గీ, జొమాటోలు తెగ యూజ్ చేసుకుంటు్నాయి. ఎంత ఛార్జీలు పెంచినా కస్టమర్ల తగ్గకపోవడంతో ఛార్జీలను యధేచ్ఛగా పెంచేస్తున్నాయి. అయితే మరోవైపు కస్టమర్లను ఆకర్షించుకునేందుకు ఈ సంస్థలు.. కొత్త కొత్త ప్రోగ్రామ్స్ కూడా లాంఛ్ చేస్తున్నాయి. కొన్నేమో డెలివరీ ఛార్జీల్ని ఎత్తేస్తుండగా.. ఇంకొన్ని డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ప్రతీ ఆర్డ్ మీదా ఏదో ఒక ఆఫర్ పెడుతున్నాయి.

Also Read:Viral Video: ముద్దుగా చిన్న పిల్లల్లా మారిపోయిన దేశాధినేతలు..వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కల్తీ కల్లు కలకలం.. 58 మందికి తీవ్ర అస్వస్థత

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు తాగి మతిస్థిమితం కోల్పోవడంతో పాటు వింతగా ప్రవర్తించారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

New Update
Kamareddy issues

Kamareddy issues Photograph: (Kamareddy issues)

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన వారంతా ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ కల్తీ కల్లు వల్ల ఒక్కసారిగా మతిస్థిమితం కోల్పోయారు. వింతగా ప్రవర్తించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

కల్తీ కల్లు తాగిన వారి పరిస్థితి విషమం..

ఈ కల్తీ కల్లు తాగిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణానికి వెళ్లి శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆ కల్లు దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ వెల్లడించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిని కల్లు దుకాణాలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ కల్లు వల్ల ఇంకా ఎందరు ప్రాణాలు కోల్పోవాలని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వాటిని పూర్తిగా క్లోజ్ చేయాలని, ఇలాంటి వాటికి అసలు పర్మిషన్లు ఇవ్వకూడదని స్థానికులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు