Asafoetida Benefits: హైబీపి వేధిస్తుందా..? ఇంగువతో ఈ వ్యాధులు పోతాయని తెలుసా..?

హైబీపి నుంచి ఉపశమనం లభించాలంటే ఇంగువ రోజూ తినాలి. ఆడవారిలో పీరియడ్స్ కడుపు నొప్పిని నయం చేయటంలో ఇంగువ అద్భతంగా పని చేస్తుంది. తలనొప్పిని తగ్గించి, ఉబ్బసం సమస్యలును ఇంగువ దూరం చేస్తుంది.

New Update
Asafoetida Benefits: హైబీపి వేధిస్తుందా..? ఇంగువతో ఈ వ్యాధులు పోతాయని తెలుసా..?

వంటల్లో చాలామంది ఇంగువని వాడుతూ ఉంటారు. మన పెద్దల కాలం నుంచి అనేక వంటల్లో ఇంగువని వేస్తూనే ఉంటారు. అయితే రోజూ ఇంగువని తినటం వలన అద్భుతమైన ప్రయోజనం ఉన్నాయి. సాధారణంగా ఇంగువను చాలా తక్కువ మంది ఇళ్లల్లో ఉపయోగిస్తుంటారు. కానీ.. ఎప్పటి నుంచో ఇంగువా చాలా రకాల హోం రెమెడీస్‌లో వాడేవారు. ముఖ్యంగా కడుపు సమస్యలు ఉన్నవారికి ఇది దివ్యౌషధం అని చెప్పాలి. అంతేకాదు.. అధిక రక్తపోటును తగ్గించడానికి ఇంగువా అద్భుతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో అధిక రక్తపోటు సమస్య అనేది ప్రతిఒక్కరిని ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ రక్తపోటు వేధిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగువ బెస్ట్‌ మెడిసిన్‌గా ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఇంగువ ఎలా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: గుడ్డు- ఆమ్లెట్ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదంటే..?

అధిక రక్తపోటు ఉన్న రోగులు తేనెతో కలిపిన పొడి ఇంగువా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేస్తే ఆస్తమా, శ్వాస సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అధిక BP ఉంటే ఇది నియంత్రణలో ఉంచుతుంది. యాంటీ వైరల్, కార్మినేటివ్, యాంటీ బాక్టీరియల్, ఇన్ఫ్లమేటరీ, ఉపశమనంతోపాటు మూత్రవిసర్జన లక్షణాలు, జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను దూరం చేయటంలో ఇంగువా చాలా ఉపయోగపడుతోందని వైద్యు అంటున్నారు. అంతేకాకుండా .. ఇంగువను ఉపయోగించేందుకు ఉత్తమమైన, సులభమైన మార్గం రోజువారీ ఆహారంలో తీసుకోవటం. దీని కోసం ఇంట్లో తయారు చేసిన పప్పులు, కూరగాయలలో ఇంగువాను వేస్తే ఆహారం రుచిని పెంచి BPని అదుపులో ఉంచుతుంది. శరీరంలో రక్తం మందంగా తయారు కాకుండా రక్తాన్ని పలచగా చేసేందుకు ఇంగువ బాగా పనిచేస్తుంది. దీని వల్ల మన శరీరంలో రక్తపోటు బాలన్స్‌గా ఉండి సమస్యలు దగ్గరకు రాకుండా ఉంటాయి.

ఇంగువ అద్భతంగా పని చేస్తుంది

ఇంకా చెప్పాలంటే..ఆడవారిలో పీరియడ్స్ కడుపు నొప్పిని నయం చేయటంలో ఇంగువ అద్భతంగా పని చేస్తుంది. తలనొప్పిని తగ్గించి, ఉబ్బసం నుంచి ఉపశమనం ఇస్తుంది. గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా పొడి ఇంగువ, చిటికెడు సైంధవ లవణం, చిటికెడు అల్లం కలిపి తింటే కడుపునొప్పి, హైబీపీ వాతం, గ్యాస్‌ సమస్య పోయి కడుపునొప్పిని వెంటనే తగ్గుతుంది. ఇంగువాను మజ్జిగ లేదా గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే మంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే

ఆర్ఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. కోహ్లీ 70 పరుగులు, పడిక్కల్ 50 పరుగులతో చెలరేగిపోయారు.

New Update
RCB Vs RR

RCB Vs RR

టార్గెట్ ఎంతంటే?

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

రికార్డు మిస్

కోహ్లీ మొత్తంగా మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేవాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా కొత్త రికార్డును క్రియేట్ చేసేవాడు. కానీ మూడు సిక్సుల్లో రెండు మాత్రమే కొట్టడంతో ఆ రికార్డు మరో మ్యాచ్‌ కోసం షిఫ్ట్ అయింది. దీంతో ఇప్పుడు కోహ్లీ పేరిట 299 సిక్సులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో మరొక ప్లేయర్ హాఫ్ సెంచరీ చేశారు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (50) చేసి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

telugu-news | virat-kohli | IPL 2025 | rcb-vs-rr | latest-telugu-news 

Advertisment
Advertisment
Advertisment