Hyderabad:మరీ ఇంత క్రూరమా? కోట్లకు కోట్లు కట్నం తీని కూడా హింస పెట్టి చంపేశారు!

నాలుగు కోట్లు కట్నం తీసుకున్నారు. బంగారం, ఇల్లు అన్నీ ఇచ్చారు..కానీ వాళ్ళకి ఇంకా ఆశ చావలేదు. మూడేళ్ళుగా అమ్మాయిని అదనపు కట్నం కోసం వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

New Update
Hyderabad:మరీ ఇంత క్రూరమా? కోట్లకు కోట్లు కట్నం తీని కూడా హింస పెట్టి చంపేశారు!

Woman Sucide Because Of Dowry Demand:భారతదేశం అభివృద్ధివైపు పరుగులు పెడుతోంది. ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. పెద్ద చదువులు చదువుకుని దూసుకుని వెళుతున్నారు అమ్మాయిలు, అబ్బాయిలు...కానీ ఇంకా మన దేశంలో వరకట్నం వేధింపులు మాత్రం ఆగలేదు. ఈ వేధింపులతో చావులూ ఆగలేదు. కోట్లకు కోట్లు కట్నం ఇచ్చి బంగారం లాంటి అమ్మాయిలను తీసుకెళ్ళి నరరూప రాక్షసుల చేతుల్లో పెడుతున్న అమ్మాయిల తల్లిదండ్రులకూ బుద్ధి రావడం లేదు. ఎన్ని చావులను చూస్తున్నా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ అమ్మాయిల జీవితాలను బలి పెడుతున్నారు.

4కోట్లు ఇచ్చి మరీ ఆత్మహత్య చేసుకున్న వివాహిత..

అమ్మాయి తల్లిదండ్రులకు బాగా డబ్బులున్నాయి. ఒక్కతే కూతురు..తమకున్నది అంతా ఇచ్చేసి మరీ పెళ్ళి చేశారు. కానీ అవతలి వాడు ఉత్త వెధవ. కోట్లకు కోట్లు కట్నం తీసుకుని కూడా వేధించాడు. ఆత్మహత్య చేసుకునే వరకూ హింసించాడు. హైదరాబాద్ సురారంలో జరిగిందీ సంఘటన. సూరారం నివాసి బట్ట అభిలాష్ తో అమరావతి వివాహం 2019 నవంబర్ 22న జరిగింది. అమరావతికి పుట్టింటివారు 550 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కేజీల వెండి ఆభరణాలు, 10 లక్షల నగదు, పెళ్లి కానుకగా ఇచ్చారు. ఇది కాకుండా అమరావతికి హయత్ నగర్ లో మూడు కోట్ల విలువ చేసే పుట్టింటి వారిచ్చిన ప్లాట్ కూడా ఉంది.

మూడేళ్లుగా నరకం..
పెళ్ళయిన కొత్తలో అంతా బాగానే ఉంది. కానీ కొన్ని రోజులకే తమ అసలు రూపం చూపించడం మొదలుపెట్టారు భర్త అభిలాష్, అతని తల్లిదండ్రులు. అన్ని కోట్లు ఇచ్చినా ఇంకా దడ్డులు తెమ్మని అమరావతిని హింసించారు. మూడేళ్ళు నరకం చూపించారు. ఈ మద్యలో పిల్లలు పుట్టారు. అయినా కనికరించలేదు. చివరకు విసిగిపోయిన అమరావతి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు తన చావుకు కారణం భర్త, అత్తమామలే అంటూ సూపైడ్నోట్ కూడా రాసింది. అందులో తన తల్లిదండ్రులు ఎంత కట్నం ఇచ్చిందీ...భర్త, అత్తమామలు తనను ఎలా హింసించారు అన్నదీ కూడా వివరంగా రాసింది అమరావతి.

చివరకు ఫ్యాన్‌కు ఉరేసుకుని..
భర్త అభిలాష్ వేధింపులు, అదనపు కట్నం డిమాండ్ తో ప్రతిరోజు ఆమె భర్తతో నరకం చూసింది. భర్త బాధలకు, అదనపు కట్నం వేధింపులకు విసిగిపోయిన అమరావతి సూరారంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సూరారం పోలీసులు కేసు నమోదు చేసుకుని, శవాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతురాలు సోదరుడు దినేష్ తన సోదరి అమరావతి మృతికి కారకులైన భర్త అభిలాష్, అత్త అనురాధ, మామ శ్రీశైలంపై చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hanuman Shobha Yatra : జై శ్రీరాం నినాదాలతో మార్మోగుతున్న హైదరాబాద్

‘జై బోలో హనుమాన్‌కి, జైశ్రీ రాం’ అంటూ భక్తుల ఆధ్యాత్మిక నినాదాలతో హైదరాబాద్ మార్మోగుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. కాగా గ్రేటర్ హైదరాబాద్‌లో వీర హనుమాన్ శోభాయాత్రలు జరుగుతున్నాయి.

New Update
Hanuman Shobha Yatra

Hanuman Shobha Yatra

Hanuman Shobha Yatra :హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. శనివారం తెల్లవారు జామునుంచే భక్తులు హనుమాన్ ఆలయాలకు చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ వీర హనుమాన్ శోభాయాత్రలు జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ నుంచి నేటి మధ్యాహ్నం ప్రారంభమైంది.. గౌలిగూడ నుంచి కోరి, నారాయణగూడ బైపాస్ మీదుగా సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ ర్యాలీ సాగనుంది. భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో వేలాది వాహనాలతో పాటు లక్షలాది మంది భక్తులు పాల్గొనడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.12 కిలోమీటర్ల యాత్రకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ గౌలిగూడలోని శ్రీరామ మందిరానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
Also Read: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
 
 ‘జై బోలో హనుమాన్‌కి, జైశ్రీ రాం’ అంటూ భక్తుల ఆధ్యాత్మిక నినాదాలతో హైదరాబాద్ మార్మోగుతోంది. యువత ఉత్సాహంతో జై హనుమాన్‌ అంటూ నినదిస్తున్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించే శోభాయాత్రలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పశ్చిమ మండలం పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.గౌలిగూడ నుంచి సికింద్రాబాద్‌ తాడ్‌బండ్‌ వరకు కొనసాగనున్న ఈ యాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో హనుమాన్‌ శోభాయాత్రకు ముస్లిం సోదరులు స్వాగతం పలికి మతసామరస్యాన్ని చాటారు.  

 పశ్చిమ మండలం పరిధిలో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఫిలింనగర్‌, సంజీవరెడ్డినగర్‌, మధురానగర్‌, బోరబండ, మాసబ్‌ట్యాంక్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఇప్పటికే ర్యాలీలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహిస్తారనే దానిపై పోలీసులకు స్పష్టత వచ్చింది. కొన్ని ర్యాలీలు ఉత్సవాలు జరిగే ఆలయాల పరిధిలోనే జరుగుతుండగా, మరికొన్ని ప్రధాన ర్యాలీల్లో కలుస్తుండటంతో అందుకు అనుగుణంగా అదనపు బలగాలను రంగంలోకి దించారు. సుమారు రెండు వేల మందికి పైగా అదనపు సిబ్బందిని హనుమాన్‌ శోభాయాత్ర బందోబస్తుకు ఉపయోగించనున్నారు. ఆలయాల వద్ద కూడా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయాలకు వచ్చే మహిళా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మహిళా సిబ్బందిని వినియోగిస్తున్నారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

 

Advertisment
Advertisment
Advertisment