Andhra Pradesh: తిరుపతిలో దారుణం-భర్తతో యువతిపై అత్యాచారం

రాను రాను మనుషులు మరీ దారుణంగా తయారవుతున్నారు. ఎటువైపు వెళుతున్నామో కూడా తెలియకుండా పోతోంది. దీనికి ఉదాహరణే తిరుపతిలో జరిగిన దారుణం. ఫ్రెండ్‌కు గంజాయి అలవాటు చేసి...ఆ మత్తులో ఉండగా తన భర్త చేత అత్యాచారం చేయించిందో యువతి.

New Update
Andhra Pradesh: తిరుపతిలో దారుణం-భర్తతో యువతిపై అత్యాచారం

Tirupathi: తిరుపతిలోని ప్రముఖ యూనివర్సిటీలో BL ఫైనల్ ఇయర్ చదువుతోంది ప్రణవ కృష్ణారెడ్డి. అక్కడ తనకు కర్నూలుకు చెందిన ఓ అమ్మాయి స్నేహితురాలిగా అయింది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. దీన్ని అలుసుగా చేసుకుని ప్రణవ తన స్నేహితురాలికి గంజాయిని అలవాటు చేసింది. ఇలా రెండేళ్ళు చేసి ఆ అమ్మాయిని గంజాయికి బానిసగా చేసింది.దాని తరువాత తరచు యువతిని తన ఇంటికి తీసుకెళుతూ ఉండేది. రేండేళ్ళ తర్వాత ఒకరోజు హాస్టల్‌లో ఉంటున్న యువతికి మాయమాటలు చెప్పి మళ్ళీ తన ఇంటికి తీసుకెళ్ళింది. అప్పుడు గంజాయి మత్తులో ఉన్న యువతిని భర్త క్రిష్ణ కిషోర్‌రెడ్డితో అత్యాచారం చేయించింది.దానిని వీడియోలుగా తీసింది ప్రణవ.

ప్రణవ అక్కడితో ఆగితే బానే ఉండేది. కానీ అత్యాచారం చేసిన వీడియోలు, ఫోటోలు యువతి అన్నకు, కాబోయే భర్తకు పంపి బ్లాక్ మెయిల్ కూడా మొదలుపెట్టింది. దీంతో బాధిత యువతి ఎంఆర్ పల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో భార్యాభర్తల భాగోతాలన్నీ బయటపడ్డాయి. గతంలో కూడా ఓ యువతిని ఇలాగే మోసం చేసి..రూ. 5 లక్షలు కాజేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ప్రస్తుతం పోలీసులు భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:Paris Olympics: ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి వర్షం భయం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది

New Update

AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్‌ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు.

గతంలో చంపడానికి ప్లాన్..

ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్‌ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేశాడు.
 
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.   

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

( AP Crime | ap-crime-news | ap-crime-report | ap crime updates | ap crime latest updates )

Advertisment
Advertisment
Advertisment