Andhra Pradesh: తిరుపతిలో దారుణం-భర్తతో యువతిపై అత్యాచారం రాను రాను మనుషులు మరీ దారుణంగా తయారవుతున్నారు. ఎటువైపు వెళుతున్నామో కూడా తెలియకుండా పోతోంది. దీనికి ఉదాహరణే తిరుపతిలో జరిగిన దారుణం. ఫ్రెండ్కు గంజాయి అలవాటు చేసి...ఆ మత్తులో ఉండగా తన భర్త చేత అత్యాచారం చేయించిందో యువతి. By Manogna alamuru 26 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Tirupathi: తిరుపతిలోని ప్రముఖ యూనివర్సిటీలో BL ఫైనల్ ఇయర్ చదువుతోంది ప్రణవ కృష్ణారెడ్డి. అక్కడ తనకు కర్నూలుకు చెందిన ఓ అమ్మాయి స్నేహితురాలిగా అయింది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. దీన్ని అలుసుగా చేసుకుని ప్రణవ తన స్నేహితురాలికి గంజాయిని అలవాటు చేసింది. ఇలా రెండేళ్ళు చేసి ఆ అమ్మాయిని గంజాయికి బానిసగా చేసింది.దాని తరువాత తరచు యువతిని తన ఇంటికి తీసుకెళుతూ ఉండేది. రేండేళ్ళ తర్వాత ఒకరోజు హాస్టల్లో ఉంటున్న యువతికి మాయమాటలు చెప్పి మళ్ళీ తన ఇంటికి తీసుకెళ్ళింది. అప్పుడు గంజాయి మత్తులో ఉన్న యువతిని భర్త క్రిష్ణ కిషోర్రెడ్డితో అత్యాచారం చేయించింది.దానిని వీడియోలుగా తీసింది ప్రణవ. ప్రణవ అక్కడితో ఆగితే బానే ఉండేది. కానీ అత్యాచారం చేసిన వీడియోలు, ఫోటోలు యువతి అన్నకు, కాబోయే భర్తకు పంపి బ్లాక్ మెయిల్ కూడా మొదలుపెట్టింది. దీంతో బాధిత యువతి ఎంఆర్ పల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో భార్యాభర్తల భాగోతాలన్నీ బయటపడ్డాయి. గతంలో కూడా ఓ యువతిని ఇలాగే మోసం చేసి..రూ. 5 లక్షలు కాజేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ప్రస్తుతం పోలీసులు భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. Also Read:Paris Olympics: ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి వర్షం భయం #rape #andra-pradesh #woman #tirupathi #friend సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి