Crime News : బిడ్డకు జన్మనిచ్చి.. రోడ్డుపై పడేసిన 23 ఏళ్ల యువతి

కేరళలోని కొచ్చిలో 23 ఏళ్ల ఓ ఎంబీఏ విద్యార్థిని అపార్ట్‌మెంట్ బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తల్లిదండ్రలకు తెలియకూడదని శిశువును రోడ్డుపై విసిరేసింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నిందితురాలిని గుర్తించిన పోలీసులు.. ఆమెపై విచారణ జరుపుతున్నారు.

New Update
Crime News : బిడ్డకు జన్మనిచ్చి.. రోడ్డుపై పడేసిన 23 ఏళ్ల యువతి

Kerala : కేరళలోని కొచ్చిలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసేరేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 23 ఏళ్ల ఓ ఎంబీఏ విద్యార్థిని(MBA Student) అపార్ట్‌మెంట్ బాత్రూమ్‌లో శుక్రవారం ఉదయం బిడ్డకు జన్మనిచ్చింది(New Born Baby). ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలియకూడదని.. అమెజాన్(Amazon) పార్సిల్ కవర్‌లో శిశువును చట్టి అపార్ట్‌మెంట్‌ బాల్కనీ నుంచి బయటకు విసిరేసింది.

Also Read: హాస్టల్‌లో ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య

దీంతో రోడ్డుపై పడిన ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. అయితే కొందరు కార్మికులు పార్సిల్ కవర్‌(Parcel Cover) లో ఉన్న శిశువు మృతదేహాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. చివరికి పార్సిల్ కవర్‌పై ఉన్ అడ్రస్‌ను బట్టి పోలీసులు నిందితురాలిని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని ఆమెను విచారిస్తున్నారు.

Also Read: 2026లో భారత్ ముక్కలుగా విడిపోతుంది: పాకిస్థాన్‌ మాజీ సెనేటర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment