West bengal: దీదీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక బిల్లు ఆమోదం..

మమతా బెనర్జీ ప్రభుత్వం అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ప్రకారం ఎవరైనా లైంగిక దాడులు, అత్యాచారానికి పాల్పడితే ఈ ఘటనలో బాధితులు చనిపోయినా లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లైతే దోషులకు మరణ శిక్ష విధిస్తారు.

New Update
West bengal: దీదీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక బిల్లు ఆమోదం..

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక(Anti-Rape) బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ చట్టాల్లో సవరణలు చేసిన మొదటి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్‌ బిల్‌ 2024 అనే పేరుతో దీదీ సర్కార్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఎవరైనా ఓ వ్యక్తిపై లైంగిక దాడులు, అత్యాచారానికి పాల్పడినప్పుడు ఈ ఘటనలో బాధితులు చనిపోయినా లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లైతే దోషులకు మరణ శిక్ష విధిస్తారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు అపరాజిత టాస్క్ ఫోర్స్‌ దీనిపై ఓ నివేదిక అందిస్తుంది. ఆ తర్వాత 21 రోజుల్లోనే దోషులకు మరణ శిక్ష పడుతుంది.

Also Read: కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 9 మంది మావోయిస్టులు మృతి!

ఇటీవల మరణించిన ఆర్‌జీ కర్‌ మెడికల్ కాలేజ్ జూనియర్‌ డాక్టర్‌కు ఈ బిల్లుతో నివాళులర్పిస్తున్నామని అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వ చట్టాల్లో ఉన్న లోపాలను వెలికితీసేందుకు ప్రయత్నించామన్నారు. అత్యాచారం అనేది మానవులకు ఒక శాపం లాంటిదని వ్యాఖ్యానించారు. ఇలాంటి నేరాలు ఆపేందుకు సామాజిక సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. అలాగే ఈ బిల్లుపై రాష్ట్ర గవర్నర్‌ సంతకం చేసేలా విపక్ష పార్టీ గవర్నర్‌ను కోరాలని అభ్యర్థించారు. వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ నుంచి బాధితురాలికి న్యాయం జరగాలని.. దోషులకు మరణశిక్ష పడాలని వ్యాఖ్యానించారు.

Also Read: IAS స్మితా సబర్వాల్‎కు భారీ ఊరట.. ఆ పిటిషన్‎ కొట్టేసిన కోర్టు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raj Tarun: ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన యంగ్ హీరో..

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్'తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా టీజర్ విడుదలై ప్రమోషన్స్ షురూ అయ్యాయి. గత వివాదాల తర్వాత పెద్దగా కనిపించలేదు రాజ్, తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. 

New Update
Raj Tarun

Raj Tarun

Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పాలంటే, అతని స్టైల్ కొంచెం ప్రత్యేకమే. కేవలం సినిమా ప్రమోషనన్స్ టైమ్ లో మాత్రమే కనిపించి, తర్వాత పూర్తిగా మాయమవ్వడం అతని అలవాటుగా కనిపిస్తోంది. మూవీ రిలీజ్ టైమ్ లో తప్ప మిగతా రోజుల్లో  ఏమాత్రం అప్‌డేట్స్ లేకుండా మాయమయిపోతుంటాడు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రాజ్ తరుణ్ లాగానే అతని సినిమాలు కూడా అంతే త్వరగా మాయమవుతాయి. ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడో, టైటిల్ ఏంటి, ఎప్పుడు విడుదలవుతుందో ఇవేమి ఎవరికీ తేలేదు. సడన్ గా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు.

‘పాంచ్ మినార్’ ప్రమోషన్స్..

అయితే ఈ సారి కూడా అదే జరిగింది,  రాజ్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చాడు. ‘పాంచ్ మినార్’(Paanch Minar) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. చిత్ర బృందం టీజర్‌ను లాంచ్ చేసింది. ఇకపై సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను వరుసగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విడుదల కూడా త్వరలోనే ఉండబోతుందట.

Also Read: ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!

ఇదంతా పక్కనపెడితే, గతంలో రాజ్ తరుణ్ పై వచ్చిన వ్యక్తిగత వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. లావణ్య అనే మహిళ రాజ్ తరుణ్ తన భర్త అని మీడియా ముందుకొచ్చి సంచలనం సృష్టించింది. ఆ వివాదం పెద్ద చర్చకు దారితీసినా, చివరికి ఆమెనే మళ్లీ అతనికి క్షమాపణలు చెప్పింది. తన ఆరోపణలకు తానే క్లారిటీ ఇవ్వడంతో, రాజ్ తరుణ్ తిరిగి తెరపైకి వస్తాడని అందరూ భావించారు.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

అయితే ఆ వివాదం సద్దుమణిగాక  కూడా రాజ్ తరుణ్ మాత్రం మౌనం వీడలేదు, కావాలనే అజ్ఞాతం లోకి వెళ్ళాడో, లేదంటే ప్లాన్డ్ సైలెన్స్‌లో ఉన్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇప్పుడు మరోసారి సినిమా విడుదల దశకు చేరుకోవడంతో మీడియా ముందుకొచ్చిన రాజ్ తరుణ్, సినిమా ప్రమోషన్స్ ముగిసిన తర్వాత మళ్లీ మాయమవుతాడా? అన్నది ప్రెశ్నగా మారింది.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

Advertisment
Advertisment
Advertisment