Viral: అమెరికా కంటే భారత్ ముందుంది...వీడియోను షేర్ చేసిన లేడీ

అమెరికా అగ్రరాజ్యం...ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో ఉంది. ప్రతీ ఒక్కరూ అమెరికాలో ఉండాలి, స్థిరపడాలి అని కోరుకుంటారు. కానీ ఒక అమెరికా మహిళ మాత్రం యూఎస్ కన్నా భారత్ పది విషయాలలో ముందుంది అంటున్నారు. వివరాలు కింది ఆర్టికల్ లో..

New Update
video

India Is Better Than USA, Video Viral

ఆధునికతలో ముందుండే అమెరికా కంటే భారత్ చాలా ముందుంది అంటున్నారు అమెరికాకు చెందిన ఓ మహిళ. ఎంతో మంది యూఎస్ లో ఉండాలని కలలు కంటారు కానీ...ఇండియా అమెరికా కంటే పది విషయాల్లో బెటర్ అని చెబుతున్నారు. వాటి వివరాలను వీడియోగా చేసి రూపొందించారు కూడా. అమెరికన్ మహిళ క్రిస్టెన్ ఫిషర్ సోషల్ మీడియా పెట్టిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.  భారతదేశంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న సౌకర్యాలు అమెరికాలో ఉండాలో ఆమె వివరించింది.

యూపీఐ దగ్గర నుంచి రిక్షా వరకూ...

ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ చాలా బావుంటాయని అంటున్నారు క్రిస్టెన్. ఇక్కడ యూపీఐ చెల్లింపులు చాలా సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పారు. తాను ఇండియాలో ఎక్కడకు వెళ్ళినా ఫోన్ తో మాత్రమే బయటకు వెళతానని...దాని ద్వారానే చెల్లింపులన్నీ చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రపంచం మొత్తం దీన్ని అమలు చేస్తే బావుంటుందని అన్నారు. అలాగే భారత్ ఆటో, రిక్షాలుఅంటే కూడా చాలా ఇస్టమని చెబుతున్నారు క్రిస్టెన్. ఇవి చాలా చవకే కాకుండా మంచి రవాణా వ్యవస్థ అని అన్నారు. అమెరికా ఇలాంటి వేగవంతమైన, చవకైన రవాణా ఎంపికలు ఉండవని చెప్పారు. 

వైద్య విధానం...

భారత్ లో మరో చెప్పుకోదగ్గ అంశం వైద్య విధానం అని అంటున్నారు క్రిస్టెన్. ఇక్కడ డాక్టర్లు సులభంగా అందుబాటులో ఉంటారని, కొన్నిసార్లు అపాయింట్‌మెంట్ లేకుండా కూడా వారు అందుబాటులో ఉంటారని అన్నారు. అలాగే ఇండియాలో ఉన్న డెలివరీ యాప్ లు కూడా చాలా ఆశ్చర్యపరిచాయని చెప్పారు. ఇంత సులభంగా, అందుబాటు డెలివరీ యాప్ లు ఉండడం అమెరికాలో సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. దానికి తోడు భారత్ లో MRP వ్యవస్థ కారణంగా, ప్రతి ఉత్పత్తిపై గరిష్ట రిటైల్ ధర ముద్రించబడుతుంది.. ఇది మోసానికి అవకాశం లేకుండా చేస్తుంది. అలాగే భారతదేశంలో ఉచిత ప్రభుత్వ చెత్త పారవేయడం సేవ అందుబాటులో ఉంది, అయితే అమెరికాలో దీని కోసం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. క్రిస్టీనా పెట్టిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. కొంత మంది ఆమె చెప్పిన వాటికి యెస్ అంటుంటే...మరి కొందరు మాత్రం భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను, పెద్ద సమస్యలను ెత్తి చూపించారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: ఓరి కామాంధుడ.. ఆవుని కూడా వదల్లేదు కదరా.. ఛీ ఛీ- వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణమైన సంఘటన జరిగింది. విజయ్ అహిర్వర్ అనే వ్యక్తి అర్థరాత్రి సమయంలో ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.

New Update
Madhya Pradesh Indore Man sexually assaulted cow

Madhya Pradesh Indore Man sexually assaulted cow

కామాంధుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. చిన్నా పెద్దా.. ముసలి ముతక అనే తేడా లేకుండా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఆఖరికి మూగ జీవాలను సైతం వదలడం లేదు. ఒంటరిగా కనిపించిన మూగజీవాలపై అఘాయిత్యాలు చేస్తున్నారు. దీని బట్టి చూస్తే.. కామాంధులు ఏ రేంజ్‌లో రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. రోడ్లపై, పశువుల సాలల్లో, మేత మేస్తున్న సమయాల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ మూగజీవాలపై లైంగిక దాడికి దిగుతున్నారు. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

ఇప్పటికే ఎన్నో సంఘటనలు ఇలాంటివి జరిగాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరొక ఘటన జరిగింది. అర్థరాత్రి సమయంలో రోడ్లపై ఉన్న ఆవుపై ఓ యువకుడు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

ఆవుపై లైంగిక దాడి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విజయ్ అహిర్వర్ అనే వ్యక్తి అర్థరాత్రి సమయంలో రోడ్డుపై వెళ్తుండగా.. రెండు మూగజీవాలు (ఆవులు) కనిపించాయి. వెంటనే అతడు ఆ రెండింటిలో ఒక మూగజీవిపై లైంగిక దాడి చేశాడు. ఒక దగ్గర నిల్చుని ఉన్న ఆ ఆవుపై అసభ్యంగా ప్రవర్తించాడు. అది ముందు ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నా.. ఆ వ్యక్తి తన అసభ్యకరమైన చర్యను ఆపలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

అనంతరం ఈ వీడియో పోలీసుల వరకు చేరుకోవడంతో వారు రంగంలోకి దిగారు. వెంటనే ఆ వీడియోలో కనిపించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడు. పలు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఎలాగోలా ఆ వ్యక్తిని పట్టుకున్నారు. 

Also Read: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

నిందితుడు విజయ్ అహిర్వ ఇండోర్‌లోని ఒక ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ADCP) రాజేష్ దండోటియా మీడియాతో మాట్లాడుతూ.. “నిందితుడిపై జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం (Prevention of Cruelty to Animals Act), 1960 కింద కేసు నమోదు చేశాం’’ అని తెలిపారు.  

(viral-video | viral-news | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment