Champions Trophy : జడేజాకు బిస్కెట్.. నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్!

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటనపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆటగాళ్లలో తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీలో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.  రవీంద్ర జడేజా స్థానంపై  సందిగ్థం నెలకొంది.

New Update
jadeja and nitish

jadeja and nitish Photograph: (jadeja and nitish)

ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు టీమిండియా జట్టు ప్రకటన మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జనవరి12లోపు అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. అయితే ఐసీసీని గడువు పొడిగించాలని అభ్యర్థించనున్నట్లు తెలుస్తోంది.  తాజా సమాచారం ప్రకారం జనవరి 18 లేదా 19న జట్టు ప్రకటన ఉంటుందని సమాచారం.  ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20, వన్డేలకు కూడా జట్లను ప్రకటించలేదు బీసీసీఐ. అయితే మరో  రెండ్రోజుల్లో టీ20 జట్టును ప్రకటిస్తారని క్రీడావర్గాలు చెబుతున్నాయి. సూర్యకుమార్ యాద‌వ్ కెప్టెన్సీలో టీమిండియా జట్టు ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. మొత్తం ఐదు టీ20లు,  మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. అయితే ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతి ఇవ్వాలని కేఎల్ రాహుల్ బీసీసీఐని కోరగా.. ముందుగా అంగీకరించినప్పటికీ.. ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఆడాలని సూచించింది బీసీసీఐ.  

ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటనపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆటగాళ్లలో కూడా తీవ్ర పోటీ నెలకొంది.  బ్యాటింగ్ ఆర్డర్, స్పిన్ అటాక్, డెత్ బౌలింగ్ వంటి అన్ని రంగాలలో ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేయడం ఇప్పుడు సెలెక్టర్లకు సవాలుతో కూడుకుంది.  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో సహా భారత టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్‌ పటిష్టంగా ఉంది.  కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లకు ఛాంపియన్ ట్రోఫీలో మిడిల్ ఆర్డర్ లో ఆడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.  

నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీలో సత్తా చాటిన తెలుగు కుర్రాడు,  ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ఛాంపియన్ ట్రోఫీలో ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.  అయితే రవీంద్ర జడేజా స్థానంపై  మాత్రం సందిగ్థం నెలకొంది.  జడేజాను తీసుకోవాలా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలా అనే  ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.  జడేజాకు అక్షర్, దూబే, సుందర్ లాంటి ఆటగాళ్లతో పోటీ నెలకొంది.  దుబాయ్ లాంటి స్పీన్ పిచ్ లపై ఆడినప్పుడు సీనియర్ ఆటగాళ్లు కీలకం అనుకుంటే జడేజాకు అవకాశం ఉంటుంది.  కాగా ఫిబ్రవ‌రి 19 నుంచి ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.  పాకిస్థాన్‌, దుబాయ్ వేదిక‌ల్లో ఈ ట్రోఫీ జరగనుంది.  

Also Read :  Sankranti కి ఇంటికెళ్తే.. ఈ రూట్ బెటర్.. ఈజీగా వెళ్లిపోవచ్చు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indian Railways: గుడ్‌న్యూస్‌.. ఇకనుంచి రైళ్లలో కూడా ATM సేవలు

ఇకనుంచి రైళ్లలో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు.త్వరలో మిగతా రైళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు.

New Update
India's first train ATM installed on board Panchavati Express

India's first train ATM installed on board Panchavati Express

రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి రైళ్లలో కూడా ఏటీఎం (ATM) సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంకుకు చెందిన ఎటీఎంను ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. 

Also Read: HCU భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు

త్వరలో పూర్తిస్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశామని.. సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫిసర్‌ స్వప్నిల్‌ నీలా తెలిపారు. కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా వినిగించిన స్థలంలోనే ఏటీఎం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రైలు ముందుకు వెళేటప్పుడు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా షట్టర్‌ డోర్‌ అమర్చినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కోచ్‌లో కూడా అవసరమైన మార్పులు మన్మాడ్‌ వర్క్‌షాప్‌లో చేశామని స్పష్టం చేశారు.

Also Read: రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

 అయితే ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినల్ నుంచి మన్మాడ్‌ జంక్షన్ వరకు ప్రతిరోజూ పంచవటి ఎక్స్‌ప్రెస్‌ వెళ్తుంది. దాదాపు 4.30 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలు ఆ మార్గంలో కీలకంగా ఉంది. అందుకే ముందుగా ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే మిగతా మార్గాల్లో కూడా రైళ్లలో ఏటీఎం సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

telugu-news | national-news | trains

Advertisment
Advertisment
Advertisment