Hyderabad: దారుణం.. యువకుడిని చంపేసి రీల్స్‌ చేశారు

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఓ యువకుడిని వెంటాడి మరీ దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అతడిని మేమే చంపేశామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ కూడా చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నారు.

New Update
Hyderabad: దారుణం.. యువకుడిని చంపేసి రీల్స్‌ చేశారు

Hyderabad Bachupally Incident Sensational Facts: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో దారుణం జరిగింది. ఓ యువకుడిని చంపి ఇన్‌స్టాగ్రామ్‌లో దుండగులు రీల్స్‌ చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రగతినగర్‌ చెరువు కట్ట వద్ద సిద్ధూ అనే యువకుడిని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు.. అతడిని వెంటాడి మరీ దారుణంగా హత్య చేశారు. అయితే ఓ హత్య కేసులో సిద్ధూ నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ప్రగతినగర్‌ సిద్దూ తన తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఆమె ఊరు వెళ్లింది. దీంతో ఒంటరిగా ఉన్న సిద్ధూ.. తన స్నేహితులైన మహేష్, సమీప్‌, శివప్పలతో కలిసి మద్యం తాగాడు.

Also Read: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు అరెస్టు.

సోమవారం తెల్లవారుజామున 3.30AM గంటల సమయంలో ప్రగతినగర్‌లో బతుకమ్మ ఘాట్ ఎదురుగా నిలబడి ఉండగా.. గతంలో హత్యకు గురైన తరుణ్ స్నేహితులు సుమార్‌ 20 మంది బైక్‌లపై వచ్చి సిద్ధూను కత్తులతో పొడిచి చంపేశారు. హత్య చేసిన తర్వాత నిందితులు సెల్ఫీ వీడియో తీసి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. తరుణ్ హత్యకు ప్రతీకారంగా తమ పగను నెరవేర్చుకున్నామంటూ ఈ వీడియోలో అన్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో.. పోలీసుల ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావించిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Also Read: లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిలా..? జైలా..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: పెళ్లయిన 6 రోజులకే ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన నవ వధువు..

జమ్మూకశ్మీర్‌లో వినయర్‌ నర్వాల్ (26) అనే నేవీ అధికారి పెళ్లయిన ఆరురోజులకే టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల చేతిలో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేని ఆ నవవధువు ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Pahalgam Attack

Pahalgam Attack

జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. టీఆర్‌ఎఫ్‌ ఉగ్రవాదుల కాల్పుల్లో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. వీళ్లలో  లెఫ్టినెంట్ వినయర్‌ నర్వాల్ (26) అనే నేవీ అధికారి పెళ్లయిన ఆరురోజులకే  ఉగ్రవాదుల చేతిలో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేని ఆ నవవధువు ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాకు చెందిన వినయ్ నర్వాల్‌.. ప్రస్తుతం కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. 

Also Read: నలుగురు టెర్రరిస్టులను గుర్తుపట్టిన భద్రతా బలగాలు

ఏప్రిల్ 16న ఆయనకు వివాహం జరిగింది. హనీమూన్‌ కోసం ఆయన తన సతీమణితో కశ్మీర్‌కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే వినయ్ జీవితం ఉగ్రవాదులకు బలైపోయింది. భర్తను కోల్పోయిన ఆ నవవధువ ఆవేదన అందరినీ కన్నీ్ళ్లు పెట్టిస్తోంది. ఆమె రోదిస్తూ.. '' మాకు పెళ్లయి ఆరు రోజులే అయ్యింది. ఈ ఘటన జరిగినప్పడు మేము పానీపూరీ తింటున్నాం. ఒక్కసారిగా ఓ ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అడిగాడు. వెంటనే తన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడని'' ఆమె ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: పహల్గామ్‌ ఉగ్రదాడి.. ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా!

ఇదిలాఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

Also Read: పహల్గామ్ అటాక్ సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్!

 telugu | Pahalgam attack

 

Advertisment
Advertisment
Advertisment