Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసుల దుర్మరణం

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాశీ, అయోధ్య దర్శించుకుని నాగ్‌పూర్ వెళ్తుండగా బస్సు లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో హైదారాబాద్‌లోకి కూకట్‌పల్లికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. అదుపు తప్పి బస్సు లోయలో పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

New Update
Madhya Pradesh bus accident

Madhya Pradesh bus accident Photograph: (Madhya Pradesh bus accident)

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దేవుడిని దర్శించుకోవడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కి చెందిన 12 మంది కాశీ, అయోధ్యతో పాటు పలు ఆలయాలను సందర్శించుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆ ఆలయాలను దర్శించుకుని తిరిగి బస్సులో వస్తుండగా మధ్యప్రదేశ్‌లో లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో హైదరాబాద్‌‌లోని కూకట్‌పల్లికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.  

ఇది కూడా చూడండి: Delhi Railway station :  ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన  ఢిల్లీ రైల్వే స్టేషన్‌!

ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతిs

తుక్కు షాపు నడిపిస్తూ..

వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం కలికుడ గ్రామానికి చెందిన పెద్దగొల్ల మల్లమ్మ(50) అనే ఆవిడ ఎన్నో ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. కూకట్‌పల్లిలో ఉంటున్న ఈమె బోరబండ చౌరస్తాలో తుక్కు షాపు నడిపిస్తూ జీవనం సాగిస్తోంది. అయితే ఈమె భర్త 15 ఏళ్ల క్రితమే మరణించారు. దీంతో షాపు నడుపుతూ జీవనం సాగిస్తోంది.

ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!

ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తల్లికి సాయంగా ఉండగా.. చిన్న కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. అయితే బస్సు లోయలో పడిపోవడంతో ఈమెతో పాటు అదే కాలనీకి చెందిన మరో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మిగతా వారంతా తీవ్రగాయాల పాలయ్యారు. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ వాహనాదారుడు మృతి చెందాడు.ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. బైక్ అదుపు తప్పడంతో అతడు కిందపడ్డాడు. దీంతో ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లింది.

New Update
Accident

Accident

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ వాహనాదారుడు మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. అయితే బైక్ అదుపు తప్పింది. దీంతో వాహనాదారుడు కిందపడ్డాడు. ఇదే సమయంలో వచ్చిన ఒక్కసారిగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తలపై నుంచి వెళ్లింది. 

Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

దీంతో ఆ బైక్ వాహనాదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడని వాహనాదారులు ఆందోళనకు దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పలువురు వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు వాళ్లని చెదరగొట్టారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.  

Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!

Advertisment
Advertisment
Advertisment