విషాదం..వాటర్ హీటర్ బకెట్లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

వాటర్ హీటర్ బకెట్లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్లి హీటర్ బకెట్లో పడ్డాడు. వేడినీళ్లలో పడిపోవడంతో బాలుడి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

New Update
water-heater

water-heater

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. వాటర్ హీటర్ బకెట్లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.  ఆడుకుంటూ వెళ్లి హీటర్ బకెట్లో పడ్డాడు. వేడినీళ్లలో పడిపోవడంతో బాలుడి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి.  అయితే గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.  భార్య సుమలత, ఇద్దరు కుమారులతో కాటి నర్సింహా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

Also read :  పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

Also read :  ఏపీ యువతకు మంత్రి లోకేష్ శుభవార్త.. 20 లక్షల ఉద్యోగాలపై కీలక అప్డేట్!

పిల్లల్ని చూసేందుకు సుమలత తల్లి

అయితే ఇటీవల పిల్లల్ని చూసేందుకు సుమలత తల్లి పుల్లమ్మ ఇంటికి వచ్చింది. వారి ఇంటి సమీపంలోనే ఉండే నర్సింహ సోదరుడు సాయి ఇంటికి తన మనుమడు బన్నీ(4)ని తీసుకొని వెళ్లింది. అయితే అక్కడ స్నానానికి  వేడి నీళ్లు పెట్టిన సాయి కుటుంబసభ్యులు హీటర్‌ తీసి బకెట్‌ను అక్కడే ఉంచేశారు. పుల్లమ్మతో మాటల్లో పడిపోయి బన్నీని పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆడుకుంటున్న బన్నీ పొరపాటున వేడి నీటి బకెట్‌లో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. కాసేపటికే గమనించిన కుటుంబసభ్యులు బకెట్‌లో నుంచి వెంటనే బన్నీని బయటకు తీశారు. అప్పటికే ఆ నాలుగేళ్ల బాలుడు ఛాతీ భాగం కాలిపోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. చిన్నారి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికంగా ఈ ఘటన అందర్నీ కలిచివేసింది.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు.  

Also Read :  Marriage : ఎంతకు తెగించావ్ రా.. ఉదయం లవర్తో.. రాత్రి మరో అమ్మాయితో

Also read :  తెలంగాణలో ఘోరం.. చెరుకు రసం మిషన్లో ఇరుక్కుకున్న మహిళ జుట్టు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral news: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ముగ్గురు పిల్లల తల్లి ఇంటర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఇది ఉత్తరప్రదేశ్‌ అమ్రోహా జిల్లాలో జరిగింది. శివాణికి గతంలో 2 పెళ్లిళ్లు అయ్యాయి. ఏప్రిల్ 9న ఇంటర్మీడియేట్ స్టూడెంట్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి వరుడు ఫ్యామిలీ కూడా ఒకే చెప్పింది.

New Update
UP inter student marriage

ఆమె వయసు 30ఏళ్లు. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆ మహిళ ఇంటర్మీడియేట్ సెకండ్ ఈయర్ విద్యార్థిని ప్రేమించింది. ఇది వరకే ఆమెకు రెండు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగింది. షబ్నం అనే 30ఏళ్ల మహిళ బుధవారం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 18 బాలుడిని పెళ్లి చేసుకుంది. ఆమె హిందూ మతంలోకి మారి శివానిగా పేరు మార్చుకొని అతన్ని వివాహం చేసుకుంది. ఈ సమాచారం ఆలస్యంగా అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ దీప్ కుమార్ పంత్ వివరాల ప్రకారం.. శివాని అనే మహిళను గతంలో షబ్నం అని పిలిచేవారు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. గతంలో రెండుసార్లు వివాహం చేసుకుంది. మరోసారి ఓ ఇంటర్ సెకండ్ ఈయర్ బాలుడితో గుడిలో వివాహం చేసుకుంది.

Also read: Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

ఉత్తరప్రదేశ్‌లో మతమార్పిడి నిరోధక చట్టం అమలులో ఉంది. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ చట్టం, కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శివానీ మొదట మీరట్‌లో ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారని, కానీ అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె సైదన్‌వాలి గ్రామానికి చెందిన తౌఫిక్‌ను వివాహం చేసుకుంది. అతను 2011లో రోడ్డు ప్రమాదంలో వికలాంగుడిగా మిగిలిపోయాడు. ప్రస్తుతం షబ్నం (శివాని) సెకండ్ ఈయర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ఆ అబ్బాయి కుంటుంబ కూడా ఒప్పుకుంది. దీంతో హిందూ సాంప్రదాయం ప్రకారం దేవాలయంలో మ్యారేజ్ చేసుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment