/rtv/media/media_files/2025/03/22/P5WTEg98sIM96Gbny009.jpg)
తల్లిని వలలో వేసుకుని మైనర్ బాలికకు కడుపు చేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మ ఆస్పత్రిలో శనివారం మైనర్ బాలిక అబార్షన్ కేసు విచారణలో దారుణాలు వెలుగు చూశాయి. నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు విభేదాలతో కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. భార్య తన కూతురితో కలిసి భువనగిరి జిల్లా లోని ఘట్కేసర్ ప్రాంతంలో నివాసముంటోంది.
Also read : దారుణం... ఆర్టీసీ బస్సు టైర్ కింద పడి టెన్త్ విద్యార్థిని మృతి
ఈడుకొచ్చిన కూతురిపై కూడా కన్ను వేసి
ఈ క్రమంలోనే ఆమెకు మరిది వరుసయ్యే రాము అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తల్లిని వలలో వేసుకున్న దుర్మార్గుడు ఈడుకొచ్చిన కూతురిపై కూడా కన్నేశాడు. తల్లి ప్రొద్బలంతో దుర్మార్గుడు పలుమార్లు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చంది. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక సదరు బాలిక కొద్దిరోజుల క్రితం అమ్మమ్మకు తెలిపింది. ఈ విషయం గుట్టు చప్పుడు కాకుండా తొర్రూరులోని అమ్మ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు అబార్షన్ నిర్వహించారు.
Also read : నీ మొగుడ్ని వదిలేసి రా.. హైదరాబాద్ మహిళకు ఎన్ఆర్ఐ వేధింపులు
ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు
అయితే బాలికకు అబార్షన్ జరిగిన విషయం చైల్డ్ లైన్ కు పలువురి నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో తల్లి, ఆమె ప్రియుడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అబార్షన్ నిర్వహించిన ఆస్పత్రి యాజమాన్యంపై, బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన రాము, అందుకు సహకరించిన బాలిక తల్లిపై అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Also Read : ఏం తెలివిరా అయ్యా.. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి క్రికెట్ బెట్టింగ్లు!
Also read : Sudha Murthi: 70 గంటల పని విధానంపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు