Flight: గాల్లో ఉండగానే ఊడిన విమానం టైరు.. చివరికి

అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ ఎయిర్‌పోర్టులో బోయింగ్‌ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే దాని ల్యాండింగ్ గేర్‌ టైరు ఊడిపోయింది. డ్రైవర్‌ అప్రమత్తంగా ఉండటంతో పెనుముప్పు తప్పింది. చివరికి విమానం డెన్వర్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

New Update
Flight: గాల్లో ఉండగానే ఊడిన విమానం టైరు.. చివరికి

అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ ఎయిర్‌పోర్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని ల్యాండింగ్ గేర్‌ టైరు ఊడిపోయింది. ఆ విమానం లాస్‌ ఏంజిల్స్ నుంచి డెన్వర్‌కు బయలుదేరుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పైలట్‌ అప్రమత్తంగా ఉండటంతో ముప్పు తప్పింది.

Also Read: విమానంలో కొట్టుకున్న ప్యాసింజెర్లు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

చివరికి డెన్వర్‌లో బోయింగ్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ విమానంలో 181 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇదిలాఉండగా బోయింగ్ విమానాల్లో తరచుగా సాంకేతిక సమస్యలు రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజా ఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ విచారణకు ఆదేశించింది.

Also Read: అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Taliban Government : పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి సంఘటనపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఖండించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది.

New Update
Taliban's

Taliban's

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించారు. ఈ సంఘటనను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఈ భయంకరమైన సంఘటనపై స్పందించి ఖండించింది.


'జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని IEA విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండిస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తోంది. ఇటువంటి చర్యలు దేశభద్రతను దెబ్బతీస్తాయి' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ ఖహర్ బాల్ఖీ బుధవారం ఎక్స్ వేదికగా ఒక ప్రకటనలో తెలిపారు. అటు పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండించింది అని దాడి జరిగిన దాదాపు 24 గంటల తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది.

Also Read :  Vinay Narwal : ఈమెకు ఏం చెప్పి ఓదార్చుదాం..  కన్నీళ్లు పెట్టిస్తున్న హిమాన్షి వీడియో!

ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తాం

భారత్ ను ఎవరూ భయపెట్టలేరని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.  త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తామని అన్నారు.  పహల్గాం దాడికి అతి త్వరలో ప్రతీకారం  తీర్చుకుంటామని.. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఎక్కడ నక్కిన కూడా పట్టుకుంటామని హామీ ఇచ్చారు.  ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేదే భారత్ నినాదమని తెలిపారు.  ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడ్డారన్న రాజ్ నాథ్ సింగ్...  ఈ చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాకుండా, తెరవెనుక ఉన్న వారిని కూడా వదిలిపెట్టబోమన్నారు.  తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు రాజ్ నాథ్ సింగ్.

Also Read :  BCCI సంచలన నిర్ణయం..ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లు ఇక ఉండవు?

Advertisment
Advertisment
Advertisment