Andhra Praesh: కేంద్ర కేబినెట్‌లో టీడీపీ బెర్త్‌లు ఖరారు..!

కేంద్ర కేబినెట్‌లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు రానున్నాయి. రామ్మోహన్ నాయుడుకి కేంద్రమంత్రి పదవి.. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు ప్రధాని మోదీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

New Update
Andhra Praesh: కేంద్ర కేబినెట్‌లో టీడీపీ బెర్త్‌లు ఖరారు..!

కేంద్ర కేబినెట్‌లో టీడీపీ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఇద్దరు ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు రానున్నాయి. రామ్మోహన్ నాయుడుకి కేంద్రమంత్రి పదవి.. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక రేపు ఢిల్లీలోని ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పలువురు మంత్రులు కూడా ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అలాగే టీడీపీ ఎంపీలిద్దరూ కూడా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. సాయంత్రం 7.15 PM గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం జరగనుంది. పలు దేశాధినేతలు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 293 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే.

Also Read: రామోజీరావును ఇబ్బంది పెట్టారు: పవన్‌ కల్యాణ్

Advertisment
Advertisment
తాజా కథనాలు