Viral Video: లైవ్‌లో నోరు జారిన రిపోర్టర్..వీడియో వైరల్

టీవీ రిపోర్టర్‌లు, యాంకర్లు లైవ్‌లో ఉన్నప్పుడు చాలాసార్లు మాటలు తప్పుగా మాట్లాడుతుంటారు. లైవ్‌లో, ఫ్లో లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా పొరపాట్లు అవుతూ ఉంటాయి. అయితే ఇవి ఒక్కోసారి బ్లండర్ మిస్టేక్స్ అయిపోతూ ఉంటాయి. తాజాగా సీఎన్‌బీసీ-టీవీ 18 రిపోర్టర్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

New Update
Viral Video: లైవ్‌లో నోరు జారిన రిపోర్టర్..వీడియో వైరల్

CNBC- TV18 Reporter: జర్నలిజంలో రిపోర్టింగ్ జాబ్ కొంచెం కష్టమైనదే. రిపోర్టర్‌గా చేసేవాళ్ళకు అమితమైన నాలెడ్జ్‌తో పాటూ అప్పటికప్పుడు మాట్లాడగలిగే చాతుర్యం కూడా ఉండాలి. లైవ్‌లో జరిగింది జరిగినట్టు చెప్పగలగాలి. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా ఉండాలి. దాంతో పాటూ సరైన పదాల వాడుక కూడా వచ్చి ఉండాలి. ఎలా పడితే అలా నోటికొచ్చినట్టు వాగకూడదు. సాధారణంగా రిపోర్టింగ్‌లో ఉన్నవాళ్లు అందరూ ఈ విషయంలో జాగ్రత్తగానే ఉంటారు. మాట్లాడ్డంలో తడబడినా కూడా తప్పులు దొర్లకుండా చూసుకుంటారు. కానీ ఎక్కడో ఒక చోట వారికి తెలియకుండానే లేదా అలవాటులో పొరపాటు వల్ల తప్పు పదాలు వచ్చేస్తూ ఉంటాయి. వాడకూడని పదాలు వాడడం వల్లనో, అస్సలు సంబంధం లేని పదాలు వాడ్డమో చేస్తుంటారు. అలాంటప్పుడు మాత్రం అడ్డంగా దొరికిపోతారు. అదే అయితే కనుక విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతారు రిపోర్టర్లు.

తాజాగా సీఎన్‌బీసీ- టీవీ 18 రిపోర్టర్‌కు ఇదే అనుభవం ఎదురైంది. సీఎన్‌బీసీ- టీవీ 18లో పనిచేసే అష్మిత్ అనే రిపోర్టర్ ప్రస్తుతం విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. రీసెంట్‌గా పతంజలి కేసు విషయంలో అతను రిపోర్టింగ్ చేశారు. అందులో భాగంగా అసభ్యపదజాలాన్ని వాడారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయడంలో మళ్ళీ ఇంకో తప్పు పదం కూడా వాడేశారు. చివరకు మొత్తం విషయం గ్రహించినా...అప్పటికే అది లైవ్‌లోకి వెళ్ళిపోయింది. దీంతో అష్మిత్ రిపోర్టింగ్ ఎయిర్ అయిపోయింది. పాపం అదే టైమ్‌లో స్టూడియోలో ఉన్న యాంకర్ అష్మిత్ మాటను కట్ చేసి..మళ్ళీ తిరిగి వస్తాము అని చెప్పినప్పటికీ దాన్ని అంతకు మించి సరిదిద్దలేకపోయారు.

అష్మిత్ ప్రయోగించిన అసభ్యపదజాలం మీద సీఎన్‌బీసీ ఛానెల్‌కూడా స్పందించింది. అతను వాడిన పదాలకు క్షమాపణలు కూడా చెప్పింది. అనుకోకుండా జరిగిందని...ఇక మీదట అలా జరగకుండా చూసుకుంటామని చెప్పింది. అత్యున్నత ప్రమాణాలు పాటించడానికి కట్టుబడి ఉంటామని టీవీ యాజమాన్యం ప్రకటించింది. రిపోర్టర్‌ కూడా క్షమాపణలు చెప్పారు. ఒక్కసారే తప్పు జరిగింది కాబట్టి ఏమీ చర్యలు తీసుకోవద్దని కోరారు అష్మిత్, సీఎన్‌బీసీ ఛానెల్‌ కూడా.

అయితే అష్మిత్ వీడియో మాత్రం బాగా వైరల్ అయిపోయింది. అష్మిత వాడిన పదాలకు నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. కానీ చాలా మంది రిపోర్టర్‌ను సపోర్ట్ చేస్తున్నారు. మానవ తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. అష్మిత్ మంచి రిపోర్టర్‌ అని...జరిగిన ఘటనను సీరియస్‌గా తీసుకోకూడదని అంటున్నారు. అష్మిత్ కానీ, రిపోర్టర్లు కానీ ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

Also Read:Andhra Pradesh: చింతమనేనికి లైన్‌ క్లియర్..వీడిన సస్పెన్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Dilsukhnagar: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబ్ పేలుళ్లపై హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఐదుగురికి ఉరి శిక్ష!

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్‌ షేక్‌కు ఉరిశిక్ష విధించింది.

New Update
Dilsukhnagar bomb blast case High Court sentences five to death

Dilsukhnagar bomb blast case High Court sentences five to death

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు ఊహించని తీర్పు వెల్లడించింది. పేలుళ్లకు పాల్పడిన ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్‌ షేక్‌కు ఉరిశిక్ష విధించింది. 

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

ఏం జరిగిందంటే?

2013లో దిల్‌సుఖ్‌నగర్‌‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్‌లో 18 మంది మృతి చెందారు. మరో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసును విచారించిన ఎన్‌ఐఏ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు 2016లో మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ సహా ఐదుగురికి మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. 

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

అయితే, కేసులో ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ శిక్షను సవాల్‌ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. నేడు తుది తీర్పు ఇచ్చింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థిస్తూ వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది. 

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

157 మంది సాక్ష్యులు..

21న ఫిబ్రవరి 2013లో దిల్‌సుఖ్‌నగర్‌‌లో పేలుళ్లు సంభవించాయి. ఎన్‌ఐఏ రంగంలోకి దిగి విచారణ జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఈ ఘటనలో ఇండియన్‌ ముజాహిద్‌ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌ ప్రధాన నిందితుడిగా తేలింది. ఈ ఘటనలో అసదుల్లా అక్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌, ఎజాజ్‌ షేక్‌, సయ్యద్‌ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. 

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు విచారణ తర్వాత నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్‌ భత్కల్‌ను 2013లో నేపాల్‌ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 

 

latest-telugu-news | telugu-news | dilsukhnagar-bomb-blast | today-news-in-telugu | latest telangana news | telugu crime news

Advertisment
Advertisment
Advertisment