తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం..నిర్ణయాలపై ఉత్కంఠ

తిరుమల తిరుపతి పాలకమండలి పదవీకాం రేపటితో ముగుస్తుంది. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలో ఇవాళ చివరి సమావేశం జరుగనుంది. టీటీడీ కొత్త ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని ప్రభుత్వం ఇప్పటికే నియమిస్తూ జీవో జారీ చేసింది. వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే రెండు సార్లు.. నాలుగేళ్ల కాలం పాటు టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక, ఈ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

New Update
తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం..నిర్ణయాలపై ఉత్కంఠ

TTD Governing Body Meeting: కీలక తీర్మానాలపై చర్చ

రేపటితో వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) పదవికాలం ముగుస్తుంది. ఈ రోజు వైవీ అధ్యక్షతన ఆఖరి పాలకమండలి సమావేశం తిరుమల అన్నమయ్య భవన్‌లో జరగనుంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 29 మంది సభ్యులు ఉన్న పాలకమండలి ఆఖరి సమావేశంగా భేటీ కానుంది. పలు కీలక తీర్మానాలపై చర్చించనుంది. కొత్త పాలక మండలి చైర్మన్‌గా(TTD New Chairman) తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఎంపికయ్యారు. విధేయత అనుభవం భూమనకు అనుకున్న పదవి దక్కేలా చేసింది. ఇప్పటికే 2004 నుంచి 2006 వరకు పాలక మండలి సభ్యుడుగా, 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా కొనసాగిన భూమన ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యేగా టీటీడీ బోర్డులో స్పెషల్ ఇన్వైటీగా ఉన్నారు.

శ్రీవారి సేవా.. నా అదృష్టం..

అయితే, ఇప్పుడు కూడా టీటీడీ చైర్మన్‌గా రెండోసారి శ్రీవారి ప్రథమ సేవకుడిగా బాధ్యతలను భూమన కరుణాకర్ చేపట్టబోతున్నారు. అప్పుడు తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు ఇప్పుడు కొడుకు జగన్ సీఎంగా ఉన్నప్పుడు రెండు సార్లు టీటీడీ చైర్మన్‌గా పనిచేసే అదృష్టం ఎవరికీ రాదు భూమన అన్నారు. టీటీడీ పట్ల పూర్తి అవగాహన ఉందంటున్న భూమన చైర్మన్‌గా హిందూ ధార్మిక వ్యాప్తి కోసమే పనిచేస్తానని తెలిపారు. టీటీడీ కొత్త చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ఈ నెల 10న బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11.44 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి వద్ద చైర్మన్‌గా రెండోసారి భూమన శ్రీవారి ప్రథమ సేవకుడిగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. టీటీడీ చైర్మన్‌గా ప్రభుత్వం భూమనను ప్రకటించడంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి తో పాటు టీటీడీ యంత్రాంగమంతా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. TTD Governing Body

Also Read: రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ఎత్తివేత : కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News: చపాతీలతో తల్లీ కొడుకుకి అస్వస్థత..

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Apr 08, 2025 07:24 IST

    కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

    గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,740, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83, 250, ఒక కేజీ వెండి ధర రూ.92,112 పలికింది.

    today gold rates
    today gold rates Photograph: (today gold rates)

     



  • Apr 08, 2025 07:23 IST

    ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

    అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.



  • Apr 08, 2025 07:23 IST

    ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో పిడుగుల వర్షం

    బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 10, 11.12,13 తేదీల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.



  • Apr 08, 2025 07:22 IST

    తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

    తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!



  • Apr 08, 2025 07:22 IST

    ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!



  • Apr 08, 2025 07:21 IST

    క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!



Advertisment
Advertisment
Advertisment