/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ttd-jpg.webp)
Family Alleges Misbehaviour by TTD : గర్భగుడిలో టీటీడీ (TTD)సభ్యులు అసభ్యకంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు హైదరాబాద్ కుటుంబానికి చెందిన దంపతులు. శ్రీవాణి ట్రస్టుకు రూ.10,500 చొప్పున చెల్లించి వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్తే గర్భాలయంంలోని సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని వారు ఆరోపించారు. టీటీడీ ఉద్యోగి తన భార్య చేయి పట్టుకుని పక్కకు తోశాడని.. అలా చేయొద్దని చెబితే తానిలానే ఉంటానని ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా చెప్పారని అన్నారు.
తమ వెనుక ఉన్న మరో మహిళతో కూడా అలాగే చేశారని..ఆ క్రమంలో ఆమె చేతిగాజులు సైతం విరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Also read:ఇప్పుడు కాదు.. ఆ తరువాతే.. కాన్వాయ్కు నో చెప్పిన రేవంత్..
తాము 25, 30 ఏళ్ళ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నామని...ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని చెబుతున్నారు దంపతులు (Family). అంత దూరం నుంచి వస్తే ఇలా చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సరిగ్గా మాట్లాడడం లేదని కూడా అంటున్నారు. మీ దిక్కున్నచోట చెప్పుకోండి అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని...దీనిని టీటీడీ సీరియస్ గా తీసుకుని చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆ ఉద్యోగి ఎవరో తెలియదని...ఐడీ కార్డు వేసుకోలేదని చెబుతున్నారు. అయితే తామేమీ ఆ ఉద్యోగి మీద కంప్లైంట్ చేయాలని అనుకోవడం లేదు కానీ టీటీడీ అధికారులు మాత్రం చర్యలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
తిరుమలని ఏమి చేద్దాం అనుకుంటున్నావ్ జగన్ ? మహిళలపై ఈ దురుసు ప్రవర్తన ఏమిటి?
స్వామి వారి సన్నిధిలో, మహిళల మట్టి గాజులు పగలుగొట్టేలా ప్రవర్తిస్తారా?
అసలు మీకు స్వామి వారి విలువ? మహిళలు మట్టి గాజులకి ఇచ్చే ప్రాముఖ్యత తెలుసా?
ఎలాగూ మీరు ఆ అధికారి మీద చర్యలు తీసుకోలేరు.
నిన్న భక్తులు… pic.twitter.com/rJ7ypc6n0e— Telugu Desam Party (@JaiTDP) December 6, 2023
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని టీడీపీ కూడా తన ఎక్స్ లో షేర్ చేసింది. టీటీడీని ఏం చేద్దామనుకుంటున్నావ్ జగన్ అంటూ ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితం అన్న ప్రసాదాలు నాణ్యత లేదంటూ గొడవ జరిగింది.