Telangana:గవర్నమెంటు స్కూలు విద్యార్ధులకు శుభవార్త..బూట్లు, టై, బ్యాగు, బెల్ట్...

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు విద్యాశాఖాధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటి వరకు స్కూళ్ళల్లో ఇస్తున్న యూనిఫార్మ్స్‌తో పాటూ షూస్, బ్యాగ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. దీని బడ్జెట్ ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి పంపించారు.

New Update
రోడ్డెక్కిన విద్యార్థులు.. టీచర్‌ కావాలని డిమాండ్..!

Government Schools:రాష్ట్రంలో గవర్నమెంటు బడుల్లో చదివే పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పనుంది తెలంగాణ ప్రభుత్వం. విద్యార్ధులకు యూనిఫార్మ్స్‌తో పాటూ మిగిలనవన్నీ కూడా తామే ఇస్తామని అంటోంది. బ్యాగు, షూస్ లాంటివి ఇస్తామని చెబుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని, బడ్జెట్‌ను కేంద్రానికి పంపిస్తామని ప్రభుత్వ విద్యాశాఖాధికారులు తెలిపారు.

Also read:Delhi Boy:ఆ పిల్లాడు అంతకు ముందే చనిపోయాడు..హరిద్వార్ ఘటనలో బయటపడ్డ నిజాలు

ప్రస్తుతం యూనిఫామ్ మాత్రమే...

ఇప్పటి వరకూ గవర్నమెంటు స్కూళ్ళల్లో కేవలం 2 యూనిఫార్మ్స్ మాత్రమే ఇస్తున్నారు. గతేడాది కార్పొరేట్ లుక్ ఉండేలా యూనిఫామ్ కలర్‌తో పాటూ డిజైన్ కూడా మార్చారు. అయితే షూస్ అవీ మాఈత్రం ఇవ్వడం లేదు. ఇవి ఇవ్వాలని ప్రభుత్వ విద్యాశాఖ మూడేళ్ళ నుంచి ప్రతిపాదనలు పెడుతోంది. కానీ అవి రిజెక్ట్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే కొనుక్కోవాలని కేంద్రం సూచిస్తోంది. బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు అన్నీ విషలం అయ్యాయి. ఇప్పుగు గవర్నమెంటు మారడంతో మళ్ళీ ఈ ప్రొపోజల్ మీద ఆశలు చిగురించాయి. అందుకే త్వరలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో షూప్, బెల్ట్, టై, సాక్స్‌ల కోసం ప్రతిపాదనలు పెట్టాలని విద్యాశాఖాధికారులు రెడీ అయ్యారు.

290 కోట్లు అవసరమవుతాయి...

కేంద్రం దీనికి కనుక ఆమోదం తెలిపితే 290రూ. కోట్ల ఖర్చులో కేంద్రం 60శాతం ఇస్తుంది. ఈ స్కీమ్ వలన తెలంగాణ మొత్తం ఉన్న 26 వేల ప్రభుత్వ బడుల్లో 25 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతుంది. ఈసారి దీనిని కేంద్రం ఆమోదించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని అంటున్నారు.

Also Read:KTR: సుమతీ శతకం పద్యంతో కేటీఆర్ ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment