Tirupati: తిరుపతి లో దారుణం..ముగ్గురిని హత్య చేసిన సాఫ్ట్‌వేర్‌!

తిరుపతిలోని పద్మావతి నగర్‌ లో దారుణం జరిగింది.వదినతో పాటు ఆమె ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపేశాడు మోహన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ మరిది.అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందారు.

New Update
Tirupati: తిరుపతి లో దారుణం..ముగ్గురిని హత్య చేసిన సాఫ్ట్‌వేర్‌!

Tirupati Crime: తిరుపతిలోని పద్మావతి నగర్‌ లో దారుణం జరిగింది. వదినతో పాటు ఆమె ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపేశాడు ఓ సాఫ్ట్‌వేర్‌ మరిది. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందారు. ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు మోహన్ అనే వ్యక్తి. మృతులను సునీత, దేవిశ్రీ, నీరజగా గుర్తించారు. అన్నదమ్ముల మధ్య కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు సమాచారం. మృతుడు మోహన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అతనికి 2019లో పెళ్లి జరిగింది.

అయితే ఆ పెళ్లి అతనికి ఇష్టం లేకపోవడంతో భార్యతో గొడవ పడుతుండేవాడు..దీంతో ఆమె కొంత కాలం క్రితం మోహన్‌ ను విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది. అన్న, వదినలే తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని గత కొద్ది రోజులుగా మోహన్ కోపంగా ఉన్నాడు. ఈ క్రమంలో అన్న దాసు ఇంట్లో లేని సమయంలో అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. వదినను, ఆమె పిల్లలను కడతేర్చాడు. కాగా, తన తమ్ముడు మోహన్ మానసిక స్థితి సరిగా లేదని, ఇష్టం లేని పెళ్లి చేశామంటూ తమపై కోపం పెంచుకున్నాడని అన్న దాసు తెలిపాడు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇష్టం లేని పెళ్లి చేశారనే కోపంతో మోహన్ ఇలాంటి దారుణానికి పాల్పడటం అందర్ని షాక్ కి గురి చేసింది.

Also Read: టీజీ డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదల…ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారంటే!

&

Advertisment
Advertisment
తాజా కథనాలు