/rtv/media/media_files/2025/04/27/raaesE8jUg9aKcy5F58F.jpg)
Pakistan People
పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్కు వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.
మూడు లక్ష జరిమానా..
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది. సార్క్ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025 అమల్లోకి వచ్చింది.
today-latest-news-in-telugu | india | pakistan
Toilet Remark Row: 'నల్లగా ఉంటారు.. బాత్రూమ్లు కడుగుతారు..' ముదురుతున్న యుద్ధం!
బీజేపీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ 2017లో చేసిన రెసిస్ట్ కామెంట్స్ను డీఎంకే షేర్ చేసింది. దక్షిణాది ప్రజలు నల్లజాతీయులు అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడడం దుమారాన్ని రేపుతోంది. బీహార్ కూలీలను దయానిధి మారన్ మరుగుదోడ్లు శుభ్రపరుస్తారని చెప్పడంతో ఈ వివాదం చెలరేగింది.
Toilet Remark Row: జాతులను, కులాలను, మతాలను, రంగును, రాష్ట్రాలను, ప్రాంతాలను జనరలైజ్ చేసి నోరుపారేసుకునే మనుషులు ఈ భూగోళమంతా ఉన్నారు. ఇండియా అందుకు మినాహాయింపేమీ కాదు. భారత్లో ఈ తరహా వివక్ష, మైండ్సెట్ కాస్త ఎక్కువే. రెసిజం దగ్గర నుంచి కుల వివక్ష వరకు ప్రతీది నాటుకుపోయి ఉన్న మనుషులు దేశంలో ఏ మూలకు వెళ్లినా కనిపిస్తారు. దక్షిణ భారతమైనా, ఉత్తర భారతమైనా ఈ అహంకారం ఉంటుంది. లేదు లేదు మా దగ్గర ఉండదంటే అది అబద్ధమే అవుతుంది. లేకపోతే నిజాన్ని ఒప్పుకునే, ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యమైనా లేకుండా ఉండి ఉండాలి. INDIA(బీజేపీ యాంటీ పార్టీలు) బ్లాక్ కూటమిలో కీలక పాత్ర పోషించే దక్షిణాది పార్టీ డీఎంకే, ఉత్తరాది పార్టీ జేడీయూ మధ్య ప్రస్తుతం యుద్ధం జరుగుతోంది. అందరూ హిందీ నేర్చుకోవాల్సిందేనని బీహార్ సీఎం నితీశ్కుమార్ (Nitish Kumar) తమిళ పార్టీపై చికాకు పడడం.. ఆ తర్వాత డీఎంకే ఎంపీ దయానిధి మారన్కు (Dayanidhi Maran) సంబంధించిన ఓ ఓల్డ్క్లిప్ని బీజేపీ (BJP) పనిగట్టుకోని సోషల్మీడియాలో వైరల్ చేయడం అగ్గి రాజేసింది. ఓ వీడియోలో దయానిధి మారన్ యూపీ, బీహార్ కూలీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వారంతా కూలీ పనుల కోసం వచ్చి బాత్రూమ్లు కడగడంతో తమ పనిని ముగిస్తారంటూ చులకనగా మాట్లాడారు. దీనిపై జేడీయూ స్పందించదా అని బీజేపీ ప్రశ్నించగా.. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ దయానిధి మారన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అయితే ఈ గొడవ ఇక్కడితో ఆగలేదు. తాజాగా మరో వీడియో సోషల్మీడియాలో రచ్చ చేస్తోంది.
ముదురుతోన్న యుద్ధం:
బీజేపీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ 2017లో చేసిన వ్యాఖ్యలను డీఎంకే తాజాగా షేర్ చేసింది. ఆ వీడియోలో తరుణ్ విజయ్ దక్షిణాది ప్రజలను నల్లజాతీయులు అని అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు. 'మేము జాత్యహంకారంతో ఉంటే, దక్షిణాది మొత్తం ఎందుకు ఉంటుంది? తమిళనాడు, కేరళ, కర్ణాటక , ఆంధ్రా.. వారితో ఎందుకు జీవిస్తాము? మా చుట్టూ నల్లజాతీయులు ఉన్నారు' అని రాజ్యసభ మాజీ ఎంపీ విజయ్ చేసిన కామెంట్స్ను డీఎంకే ఐటీ సెల్ సోషల్మీడియాలో షేర్ చేసింది. 2017లో అల్ జజీరా టీవీలో జరిగిన చర్చలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారాన్ని రేపారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. అయితే 2019లో మారన్ వీడియోను బీజేపీ షేర్ చేసినట్టే 2017లో విజయ్ చేసిన రెసిస్ట్ కామెంట్స్ను డీఎంకే కౌంటర్గా షేర్ చేసింది. ఇలా కౌంటర్లు, ఎన్కౌంటర్లు ఇచ్చుకునేందుకు బీజేపీ, డీఎంకే షేర్లు చేసుకుంటుంటే..ఇది కాస్త సోషల్మీడియాలో రచ్చకు దారి తీసింది. రెండు పార్టీల గొడవను కొంతమంది సౌత్ వర్సెస్ నార్త్ ఇష్యూగా చూస్తుండడం విడ్డూరం.
2019లో జరిగిన ఒక కార్యక్రమంలో దయానిధి మారన్ మాట్లాడిన వ్యాఖ్యల దుమారాన్ని రేపాయి. తమిళనాడుకు వచ్చే ఉత్తరప్రదేశ్, బీహార్ల నుంచి హిందీ మాట్లాడేవారు నిర్మాణ పనులు లేదా రోడ్లు, మరుగుదొడ్లను శుభ్రపరుస్తారని చెప్పడంతో వివాదం చెలరేగింది. ఈ క్లిప్ను షెహజాద్ పూనావల్లాతో సహా పలువురు బీజేపీ నాయకులు షేర్ చేశారు. మరో క్లిప్లో మారన్ ఇంగ్లీష్ నేర్చుకున్న వారిని, హిందీ మాత్రమే నేర్చుకునే వారిని పోల్చారు. ఇంగ్లిష్ నేర్చుకున్న వారు ఐటీ కంపెనీలలో చేరుతున్నారని.. హిందీ వచ్చిన వారు చిన్న ఉద్యోగాలు చేస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు క్లిప్స్కు కౌంటర్గా అన్నట్టు డీఎంకే విజయ్ పాత వీడియోను షేర్ చేసింది.
Also Read: ధోనీ, కోహ్లీ వల్ల కాలేదు.. మరి రోహిత్ చరిత్ర సృష్టిస్తాడా? 31ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడా?
WATCH:
India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..
ఈ నాలుగు రోజుల్లో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్కు వెళ్ళారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!
ఎల్కతుర్తి సభలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ మాట్లాడిన మాటలపై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. అధికారం పోయిన అక్కసులో కేసీఆర్ నోటికొచ్చింది మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
KCR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. దద్దరిల్లిన కేసీఆర్ ప్రసంగం
వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ రజతోత్సవ సభకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా వచ్చారు. Latest News In Telugu | తెలంగాణ
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
మధ్యప్రదేశ్ నారాయణగఢ్ పోలీస్స్టేషన్ పరిధి ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Pakistan: పాక్ పౌరులు ఇండియాలోనే ఉంటే 3 ఏళ్లు జైలుశిక్ష..
భారత్లో ఉన్న పాకిస్థానీయులు నిర్ణీత గడువులోగా వెళ్లకపోతే వాళ్లని ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. Short News | Latest News In Telugu | నేషనల్
DC vs RCB: హోరా హోరీ.. ఆర్సీబీ ముందు 162 పరుగుల టార్గెట్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..
Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!
KCR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. దద్దరిల్లిన కేసీఆర్ ప్రసంగం
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Pakistan: పాక్ పౌరులు ఇండియాలోనే ఉంటే 3 ఏళ్లు జైలుశిక్ష..