Telangana: దారుణం.. క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (S) మండలం బొప్పారం గ్రామానికి హైదరాబాద్కు చెందిన శ్రీపాల్రెడ్డి, రాజు అనే స్నేహితులు తమ కుటుంబ సభ్యులతో ఓ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో బుధవారం క్వారీ గుంతలో పడి శ్రీపాల్రెడ్డి, రాజు, ఆయన కూతురు మృతి చెందారు By B Aravind 17 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (S) మండలం బొప్పారంలో విషాదం చోటుచేసుకుంది. క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. శ్రీపాల్రెడ్డి, రాజు వీళ్లిద్దరూ స్నేహితులు. హైదరాబాద్లో ఉంటున్నారు. శ్రీపాల్ రెడ్డి బిల్డర్గా పనిచేస్తుండగా.. రాజు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. అయితే మంగళవారం బొప్పారంలోని ఓ విందు కార్యక్రమానికి వీళ్లిద్దరూ తమ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. Also Read: కుక్కల దాడికి బాలుడు బలి.. సీఎం కీలక ఆదేశాలు.. వీధికుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్ఫ్రీ నంబర్..! బుధవారం ఉదయం శ్రీపాల్ రెడ్డి, రాజు, ఆయన కూతురు (12) ఓ క్వారీ చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే రాజు కుమార్తె ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడిపోయింది. గుంతలో నీళ్లు ఉండటంతో ఆమెను కాపాడేందుకు రాజుతో పాటు శ్రీపాల్ రెడ్డి అందులోకి దిగారు. ఈత రాకపోవడం వల్ల ముగ్గురూ కూడా మృతి చెందారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. Also Read: త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు #telugu-news #quarry-accident #telangana-news #nalgonda సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి