Road Accident at Prakasam District: ప్రకాశం జిల్లాలో లారీ-బైక్ ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ లారీ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఎర్రగొండపాలెంలో ఓ ఎంగేజ్ మెంట్ కి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో తర్లుపాడు మండలం వద్ద కలుజువ్వల పాడు వద్ద లారీ, బైక్ ఢీ కొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదం తర్లుపాడు మండలం కలుజువ్వల పాడులో జరిగింది.

New Update
Road Accident at Prakasam District: ప్రకాశం జిల్లాలో లారీ-బైక్ ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్

Three dead in Road Accident at Tarlupadu in Prakasam District: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ లారీ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఎర్రగొండపాలెంలో ఓ ఎంగేజ్ మెంట్ కి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో తర్లుపాడు మండలం వద్ద కలుజువ్వల పాడు వద్ద లారీ, బైక్ ఢీ కొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదం తర్లుపాడు మండలం కలుజువ్వల పాడులో జరిగింది.

ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతులను కొనకమెట్ల మండలం అంబాపురానికి చెందిన వినోద్, నాని, వీరేంద్రగా గుర్తించారు పోలీసులు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

(This is an updating story)

Advertisment
Advertisment
తాజా కథనాలు