Covid Cases: ఏలూరులో నమోదైన కరోనా కేసు..ఇప్పటి వరకు ఏపీలో ఎన్ని కేసులంటే!

ఏపీలో 3 కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఏలూరులో ఓ ప్రైవేట్ మెడికల్ వైద్యునికి కొవిడ్‌ పాజిటివ్‌ గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.

New Update
Covid Cases: ఏలూరులో నమోదైన కరోనా కేసు..ఇప్పటి వరకు ఏపీలో ఎన్ని కేసులంటే!

ఏపీ లో కొత్తగా మూడు కరోనా కేసులు నమోదు అయ్యినట్లు వైద్యాధికారులు వివరించారు. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 328 కేసులు నమోదు అయితే వాటిలో మూడు ఏపీవే ఉన్నట్లు కేంద్రం తెలిపింది. అయితే ఇప్పడు రాష్ట్రంలో నమోదైన కేసులు పాత వేరియంట్‌ కొవిడ్‌ 19 వా, లేక కొత్త వేరియంట్‌ జేఎన్‌ 1 వా అనేది అధికారులు వివరించలేదు.

తాజాగా ఏలూరు జిల్లాలో ఓ కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది. ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజ్‌ డాక్టర్‌ కి కొవిడ్‌ పాజిటివ్‌ గా తేలింది. వేరియంట్‌ నిర్థారణ కోసం శ్వాబ్‌ ను హైదరాబాద్‌ జినోమ్ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ కి పంపించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి కొవిడ్‌ కి సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేవని..ఎవరూ కంగారు పడనవసరం లేదని అధికారులు తెలిపారు.

పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇతర రాష్ట్రాలకు వెళ్లి రాలేదని కూడా వివరించారు. రాజమండ్రి లో కూడా తొలి కొవిడ్‌ కేస్‌ నమోదు అయ్యిందని అధికారులు వివరించారు. 85 ఏళ్ల మహిళకు కొవిడ్‌ సోకినట్లు అధికారులు తెలిపారు. ఈ మహిళకు సంబంధించిన శాంపిల్స్‌ ను కూడా ల్యాబ్‌ కు పంపినట్లు అధికారులు వివరించారు.

రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అప్రమత్తం అయ్యారు. రాష్ట్ర వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.

ముందున్నది అంతా పండగ సీజన్‌ కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. దీంతో అప్రమత్తం అయిన అధికారులు ర్యాపిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, న్యుమోనియా ఇబ్బందులున్నవారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే అధికారులు అంతా వైద్యులు, సిబ్బంది, రోగులు మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.

భారత్ లో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 3వేలకు చేరుకుంది. దేశంలో జెఎన్-1 వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలనఇ ఆరోగ్యశాఖ సూచిస్తోంది. అయితే ఈ వేరియంట్ అంత ప్రమాదకరమైనది కాదని డబ్లూహెచ్వో తెలిపఇంది. ప్రస్తుతం భారత్ లో కరోనా మరణాల రేటు 1.18గా ఉంది. కానీ నిన్న ఒకే రోజు ఆరుగురు చనిపోవడం మాత్రం ఆందోళన కలిగించే విషయమని వైద్యాధికారులు చెబుతున్నారు. 

Also read: ఏసీబీ కోర్టులో లోకేష్‌ పై సీఐడీ మోమో!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: మహిళా నిర్మాతకు యో*ని పూజ.. రూ.10 లక్షలు దొబ్బేసిన అఘోరీ!

లేడీ అఘోరీ మరోమోసం బయటపడింది. యోని పూజ పేరుతో రూ.10లక్షలు దోచేసినట్లు ఓ మహిళా నిర్మాత మొకిలా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అఘోరీపై 308(5), 318(1),351(4),352 BNS సెక్షన్లకింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

New Update

 Aghori: లేడీ అఘోరీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూజల పేరిట భారీ మోసాలకు పాల్పడ్డట్లు  సైబరాబాద్‌ మొకిలా పీఎస్‌లో కేసు నమోదైంది. యోని పూజ చేస్తానంటూ రూ.10 లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ మహిళా నిర్మాత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఉజ్జయినిలోని ఫాంహౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. రెండు విడతలుగా అఘోరీకి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు తెలిపింది. దీంతో ఫిబ్రవరి 25న అఘోరీపై 308(5), 318(1),351(4),352 BNS సెక్షన్లకింద ఎఫ్ఐఆర్ నమోదైంది. 

Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్

ప్రగతి రిసార్ట్స్ కు వెళ్లి..

పోలుసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రొడ్యూసర్ లేడీ అఘోరీతో 6 నెలల క్రితం పరిచయం అయినట్లు చెప్పింది. దీంతో ప్రొద్దటూర్ లోని ప్రగతి రిసార్ట్స్ కు అఘోరిని డిన్నర్ కు పిలవగా వచ్చినట్లు తెలిపింది. అప్పటి నుంచి ఫోన్ చేస్తూ తన వ్యక్తిగత విషయాలు తెలుసుకుంది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మించింది. అది కూడా ప్రైవేట్ పార్ట్ యోని  పూజ అని చెప్పడంతో నిర్మాత పూజకు అంగీకరించింది. 

Also Read: మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..

ఈ క్రమంలోనే పూజ సామాగ్రి కోసం మొదట రూ. 5 లక్షలు అఘోరీ అకౌంట్ లో వేసింది. మొదటిసారి యూపీలోని ఉజ్జయిని ఫాం హౌస్ తీసుకెళ్లి పూజ చేసింది. ఆ తర్వాత మరో రూ.5 లక్షలు ఇవ్వాలని అడిగింది. లేదంటే పూజ విఫలమై ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుందని భయపెట్టింది. భయంతోనే మరో 5 లక్షలు అకౌంట్ లో వేసింది. మొత్తం రూ.10 లక్షలు పంపించినట్లు ఫిర్యాదులో మహిళా నిర్మాత పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. 

 cheating | producer | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment