FOOD: మూడు నగరాల నుంచి అధికంగా వెజ్ ఆర్డర్లు-స్విగ్గీ

దేశంలో మూడు నగరాల నుంచి అత్యధికంగా వెజ్ ఆర్డర్లు వస్తాయని చెబుతున్నారు స్విగ్గీ నిర్వాహకులు. అందులో రెండు సౌత్‌వి కాగా ఒకటి నార్త్ నుంచి ఉంది. ఈ మూడు సిటీల్లో నాన్ వెజ్‌తో పాటూ అత్యధికగా వెజ్ ఆర్డర్లు వస్తాయని చెబుతున్నారు.

New Update
Year End 2023 : ఒక వ్యక్తి  ఈ ఏడాది స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసిన డబ్బుతో డబుల్ బెడ్రూం కొనచ్చట.. ఎలానో తెలుసా?

Swiggy Veg Orders: కరోనా తరువాతనుంచి ఆన్ లైన్ ఫుడ్ బిజినెస్ తెగ ఊపందుకుంది. ఇల్లు కదలకుండా చేతిలోకి అన్నీ వచ్చి పడుతుండేసరికి చాలా మంది వీటి మీద ఆధారపడుతున్నారు. వీటివల్ల శ్రమ తప్పుతోంది. బోలెడు ట్రైమ్ కూడా ఆద అవుతోంది. అందుకే రోజురోజుకూ స్విగ్గ, జొమాటోలాంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్స్ డెవలప్ అవుతూనే ఉన్నాయి. స్విగ్గీ, జొమాటోలు రోజుకు లక్షలు, కోట్లలో వ్యాపారాలు చేస్తున్నాయి.

ఈ ఫుడ్ ఫామ్‌లు అప్పుడప్పుడు తమకొచ్చిన ఆర్డర్లను బట్టి సర్వేలను నిర్వహిస్తుంటాయి. తాజాగా స్విగ్గీ భారతదేశంలో ఏ నగరాల్లో ఎక్కువ మంది శాఖాహారం తినేవారు ఉన్నారు అనే సర్వే నిర్వహించింది. ఇందులో అత్యధికంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబయ్‌ల నుంచి ఎక్కువగా వెజ్ ఆర్డర్లు వస్తాయని చెబుతోంది స్విగ్గీ. అన్నింటికన్నా బెంగళూరును వెజ్జీ వ్యాలీ అంటోంది. దేశం మొత్తంలో వచ్చిన మూడు వెజ్ ఆర్డర్లల ఒకటి బెంగళూరు నుంచి తప్పుండా ఉంటుందని చెప్పింది. మసాలా దోస, పన్నీర్‌ బిర్యానీ, పన్నీర్‌ బటర్‌ మసాలాను ఎక్కువ తింటరని తెలిపింది. దీని తరువాత నార్త సిటీ అయిన ముంబయ్ రెండవ స్థానంలో నిలిచింది. దాల్‌ కిచిడీ, మార్గరీటా పిజ్జా, పావ్‌ భాజీని ఇక్కడ ఎక్కువగా ఆర్డర్‌ చేస్తున్నారు. ఇక మూడో స్థానంలో హైదరాబాద్‌ వాసులు నిలిస్తే...ఇక్కడ నుంచి మసాలా దోస, ఇడ్లీలను బాగా ఎక్కువగా ఆర్డర్ చేసి తింటున్నారని చెప్పింది స్విగ్గీ.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime : అన్నంలో మత్తు మందు కలిపి... వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ

హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పని మనుషులే ఈ దోపిడీకి పాల్పడ్డారు.

New Update
Massive theft

Massive theft

 TG Crime :  హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో ప్రముఖ పారిశ్రామికవేత్త హేమ్‌రాజ్‌ , అతడి భార్య మీనా దుగ్గర్‌ నివాసముంటున్నారు. ఇంట్లో పని మనుషులు వ్యాపారవేత్త హేమరాజు దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. అది తిన్న దంపతులిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వారు నగలు, నగదు తీసుకుని పారిపోయారు.

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

కొద్ది రోజుల క్రితం వారు నేపాల్‌కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమ్‌రాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో పాటు కారు తీసుకుని ఉడాయించారు. ప్రతి రోజూ వాకింగ్‌కు వెళ్లే  హేమరాజ్‌ సోమవారం వాకింగ్‌కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. 

Also read: Murder case: కొడుకు అక్రమ సంబంధానికి బలైన తండ్రి.. వాడి పెళ్లం ఫొటోలు వాట్సాప్ స్టేటస్‌

దీంతో అనుమానం వచ్చిన అతని స్నేహితుడు ఇంటికి వచ్చాడు. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న హేమరాజు దంపతులను అతను ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి నుంచి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన పని మనుషులు (నేపాలి దంపతులు) కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also read: wife harassment: మరో భార్యా బాధితుడు బలి.. ‘నా అస్తికలను డ్రైనేజీలో కలపండి’

Advertisment
Advertisment
Advertisment