KTR Tweet on Formula E Race:ఇది నిజంగా చాలా పూర్ డెసిషన్..ఫార్ములా రేస్ రద్దుపై కేటీఆర్ ట్వీట్

ఫార్ములా ఈ రేస్ రద్దవడం మంచి విషయం కాదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్‌ విలువ తగ్గిపోతుందని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ రద్దు మీద కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు.

New Update
KTR Tweet on Formula E Race:ఇది నిజంగా చాలా పూర్ డెసిషన్..ఫార్ములా రేస్ రద్దుపై కేటీఆర్ ట్వీట్

KTR Tweet:ఫార్ములా ఈ రేస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అస్సలు బాలేదని విమర్శించారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. ఇది హైదరాబాద్ అభివృద్ధి విషయంలో తిరోగమయనే అంటూ వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ రేస్‌ను రద్దు చేసిన కొద్దిసేపటికే కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా సిటీ, భారత్‌ బ్రాండ్ ఇమేజ్‌ పెంచుతాయని సూచించారు. గతంలో కూడా చాలా మంది ఈ రేసింగ్ చూడటానికి ఆసక్తి చూపారని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ-రేసింగ్‌పై తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో రద్దవడం సరైంది కాదని అన్నారు. భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఈ-ప్రిక్స్‌ని తీసుకురావడానికి మేము చాలా కృషి, సమయాన్ని వెచ్చించాము. ఇలాంటి చర్యలు నష్టం కలిగిస్తాయి అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Also read:విశాఖలో వెనక్కు వెళ్తున్న సముద్రం.. జపాన్ భూకంపమే కారణమా?

కొద్ది సేపటి క్రితమే..ఫిబ్రవర్ 10న హైదరాబాద్‌లో(Hyderabad) జరగాల్సిన ఫార్ములా ఈ రేస్‌ను రద్దు చేస్తున్నామని ఫార్ములా ఈ రేస్(Formula E Race) ఆపరేషన్స్ ప్రకటించింది. ఈ-రేస్ సీజన్ 10కు చెందిన నాలగవ రౌండ్ ఇక్కడ జరగాల్సి ఉంది. అయితే ఈ రేస్ గురించి తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) స్పందిచలేదని…దానికి తోడు మున్సిప‌ల్ శాఖ‌(GHMC), హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిన‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 30వ తేదీ జ‌ర‌గిన ఒప్పందాన్ని మున్సిప‌ల్ శాఖ ఉల్లంఘించిన‌ట్లు ఒక ప్రక‌ట‌న‌లో పేర్కొన్నారు. దాంతో పాటూ మున్సిపల్ శాఖకు నోటీసులు కూడా జారీ చేశామని చెబుతున్నారు. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్ఈవో చెబుతోంది. 

దేశంలోనే మొదటి సారిగా లాస్ట్ ఇయర్ జనవరిలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఇ కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ (Racing)జరిగింది. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా… హుస్సేన్ సాగర్ తీరం (Hussain Sagar) వెంబడి రేసింగ్ కార్లు పరుగులు పెట్టాయి. మన దేశంలో తొలిసారిగా జరిగిన ఈ ఇంటర్నేషనల్ ఫార్ములా – రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను చూసేందుకు పలువురు క్రీడా, సినీ, వ్యాపార ప్రముఖులు హైదరాబాద్ నగరానిలో క్యూ కట్టారు. క్రికెట్ దిగ్గజం సచిన్(Sachin Tendulkar), రామ్‌చరణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.  లాస్ట్ ఇయర్ జ‌రిగిన ప్రారంభోత్సవ రేస్ చాలా స‌క్సెస్ అయ్యింద‌ని, ఆ రేస్ వ‌ల్ల ఆ ప్రాంతంలో సుమారు 84 మిలియ‌న్ల డాల‌ర్ల ఆర్థిక ప్ర‌గ‌తి జ‌రిగింద‌ని ఫార్ములా ఈ సీఈవో జెఫ్ డోడ్స్ తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Kitchen Tips: ఈ వేసవిలో మీ వంటగదిలో ఇవి తప్పనిసరిగా ఉండాలి

వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం అవసరం. వేడి, ఆహారం, చల్లనీరు ద్వారా వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళదుంపలు, వంటివి నిల్వ చేయవద్దు. వీటిని వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

New Update
Kitchen Tips

Kitchen Tips

Kitchen Tips: వేసవిలో వేడి కారణంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. వంట గదిలో ఉండేవారి పరిస్థితి అయితే దారుణం. కాబట్టి వేసవిలో వంటగదిలో ఉంచుకోవాల్సిన కొన్ని వస్తువులు ఉన్నాయి. వేడిగా, మురికిగా ఉన్న వంటగది తెగుళ్లు, క్రిములను ఆహ్వానించి ఆహార భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. అందుకే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ మనలో చాలా మంది శ్రద్ధ వహించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా అవసరం. అలాగే తాగడానికి శుభ్రమైన నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. వేడి వల్ల ఆహారం ద్వారా, నీటి ద్వారా వ్యాధులు వస్తాయి. కాబట్టి వాటర్‌ ప్యూరిఫైయర్‌ను సరిగ్గా శుభ్రం చేయడం తప్పనిసరి.  తాగడానికి, వంట చేయడానికి లేదా ఉత్పత్తులను కడగడానికి శుభ్రమైన నీటిని మాత్రమే వాడండి.

ఆరోగ్యానికి అంత మంచిది కాదు:

మనలో చాలా మంది ఎండలోంచి వచ్చినప్పుడు చల్లటి నీరు తాగుతాం. దానికోసం చాలా మంది ఫ్రిజ్‌పై ఆధారపడతారు. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ సమయంలో చల్లటి నీరు తాగడానికి మట్టి పాత్రలను ఉపయోగించడం ఉత్తమం. వేసవిలో వంటగదిలో వాసన ఎక్కువగా వస్తుంటుంది. ఇది అన్ని రకాల తెగుళ్లను ఆకర్షించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. బొద్దింకలు, ఈగలు, చీమలు వెచ్చని, తేమతో కూడిన ప్రదేశాలలో వృద్ధి చెందే అవకాశం ఉంది. అందువల్ల ఎక్కువ హానికరం కాని సహజ పురుగుమందులను వాడాలి. అధిక వేడి వల్ల కొన్ని కూరగాయలు సాధారణం కంటే త్వరగా చెడిపోతాయి. 

ఇది కూడా చదవండి: టాయిలెట్లలో డ్యూయల్‌ ఫ్లష్‌లు ఎందుకు ఉంటాయి?

ముఖ్యంగా మనం ఫ్రిజ్ బయట ఉంచే ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళాదుంపలు వంటివి. సరిగ్గా నిల్వ చేయకపోతే అవి బూజు పట్టి కుళ్ళిపోయి మొలకెత్తుతాయి. బంగాళాదుంపలు, ఉల్లిపాయలను కలిపి నిల్వ చేయవద్దు. అవి త్వరగా చెడిపోయేలా చేసే వాయువులను విడుదల చేస్తాయి. ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండటానికి బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయండి. ఊరగాయలు తేమగా ఉండటం వల్ల అవి చాలా సున్నితంగా ఉంటాయి. శుభ్రమైన, గాలి చొరబడని గాజు పాత్రలను ఉపయోగించండి. దీంతో అవి ఎక్కువ కాలం సురక్షితంగా, పాడవకుండా ఉంటాయి. మెటల్ మూతలు వాడకూడదు. ఎప్పుడూ కంటైనర్లను పూర్తిగా ఆరబెట్టాలని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ సుమో.. స్పాట్లో ఏడుగురు!

( kitchen-tips | easy-kitchen-tips | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment