Alcohol: ఈ ఆహారాలు ఆల్కహాల్ కంటే ప్రమాదం.. దూరంగా ఉండండి

ఫాస్ట్ ఫుడ్స్ ట్రాన్స్ ఫ్యాట్, కృత్రిమ చక్కెర ఉండటం వల్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు అంటున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌కి దూరంగా ఉంటే మంచిది. అధిక ఉప్పు, కూల్‌డ్రింక్స్‌, ప్రాసెస్ చేయబడిన పిండి పదార్థాలు తీసుకున్న గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

New Update
Summer Tips: వేసవిలో ఈ 5 తప్పులు చేస్తే ఆరోగ్యం పాడవుతుంది జాగ్రత్త!

Alcohol: మన ఆహారం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి చాలా మంది వైద్యులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. అయితే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ఇవి ఆల్కహాల్‌ కంటే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు. వీటిలో పెద్ద మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్, కృత్రిమ చక్కెర ఉండటం వల్ల మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను కలిగిస్తుంది. అందుకే ఫాస్ట్‌ఫుడ్‌కి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు.

ప్రాసెస్ చేయబడిన పిండి పదార్థాలు:

  • మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఆహారం నుంచి ప్రాసెస్ చేయబడిన పిండి పదార్థాలను బహిష్కరించండి. ఈ ఆహారాలు మీ కాలేయానికి చాలా హానికరం. ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. సంతృప్త కొవ్వు పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది.

అధిక ఉప్పు:

  • ఉప్పు మన శరీరానికి ప్రమాదకరం. ఉప్పు తీసుకోవడం ఎంత తగ్గించుకుంటే జీవితం అంత ముందుకు సాగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయంలో హెచ్చరించింది. ఉప్పగా ఉండే ఆహారాలు కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అధిక సోడియం, అధిక రక్తపోటు కూడా వస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే స్ట్రోక్‌కు దారితీస్తుంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ తగ్గించండి. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది.

కూల్‌డ్రింక్స్‌:

  • ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ కూల్‌డ్రింక్స్‌ తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటును వెంటనే మానుకోవాలని వైద్యులు అంటున్నారు. శీతల పానీయాలు ఎక్కువగా తాగే వ్యక్తులు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. షుగర్‌ ఎక్కువగా ఉన్న డ్రింక్స్‌ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది.

ఇది కూడా చదవండి: సిగరెట్‌ తాగితే మెదడు పనిచేయడం మానేస్తుందా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వెజిటేబుల్‌ బిర్యానీ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijayashanthi Vs Revanth: రేవంత్ రెడ్డికి షాకిచ్చిన విజయశాంతి.. సంచలన ట్వీట్!

మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు.. అంటూ ధరిత్రి దినోత్సవం సందర్భంగా విజయశాంతి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. HCU భూముల విషయంలో రేవంత్ టార్గెట్ గా ఆమె ఈ పోస్ట్ చేశారన్న చర్చ సాగుతోంది.

New Update

ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన పోస్ట్ నెట్టింట ఆసక్తికరంగా మారింది. అనంతమైన ఈ విశ్వంలో మనిషికి ఆవాసయోగ్యమైన ఏకైక గ్రహం భూమి మాత్రమే. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగా వినియోగించుకుంటేనే.. మనిషి మనుగడ సాఫీగా సాగుతుంది. ఆ వనరుల్లో దేన్ని దుర్వినియోగం చేసినా.. సమస్త మానవాళి జీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ.. మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు. పరిశ్రమల పేరుతో.. గాలి, నీటిని కాలుష్యంలో ముంచెత్తుతున్నాడు. సహజ వనరుల్ని అవసరానికి మించి వినియోగిస్తున్నాడు.

తన స్వార్థంతో మొత్తం ప్రకృతి స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ఇంత చేస్తుంటే.. ప్రకృతి ఊరుకుంటుందా..? భూకంపాలు, సునామీలు, వరదలు, కరువులతో హెచ్చరికలు చేస్తూనే ఉంది. కొన్ని సార్లు.. వైరస్‌ల రూపంలోనూ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో భూమి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేస్తోంది.. ఇకనైనా మారుదాం.. ప్రకృతి వనరుల్ని కాపాడుకుందాం. అందరికీ ప్రపంచ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ తన X ఖాతాలో విజయశాంతి పోస్ట్ పెట్టారు.

అయితే... విజయశాంతి ట్వీట్‌ పై తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. HCU వివాదం నేపథ్యంలో రేవంత్‌కు విజయశాంతి గట్టి కౌంటర్‌ ఇచ్చారని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ఇన్‌ఛార్జ్‌ కూడా HCU భూములపై రియాక్ట్‌ కాగా.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ కూడా రేవంత్‌ చర్యలు సరికావని ఇన్‌డైరెక్ట్‌గా విమర్శిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

కాంగ్రెస్‌ నేతలు మాత్రం... పచ్చకామెర్ల రోగికి అన్నీ పచ్చగా కన్పించినట్లు.. గులాబీ నేతలకు పవరే కాదు... బుర్రలో చిప్‌ కూడా దొబ్బిందని ఘాటుగా స్పందిస్తున్నారు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్లుగా.. ప్రతీ దానికి రేవంత్‌కు ముడిపెట్టడం... కామన్‌ అయిపోయిందని విమర్శిస్తున్నారు. 

(vijayashanthi | telugu-news | telugu breaking news | hcu land )

Advertisment
Advertisment
Advertisment