Kids Health: ఈ ఫుడ్స్ పిల్లల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం!

మార్కెట్లో మనకు వివిధ రకాల హెల్త్ డ్రింక్స్ లభిస్తున్నాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు, పెద్దల ఆరోగ్యానికి మంచివనే ప్రకటనలూ రోజూ చూస్తుంటాం. అయితే ఇటీవల వాణిజ్య మంత్రిత్వ శాఖ కొన్ని డ్రింక్స్‌ను హెల్తీ డ్రింక్స్ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది.అవేంటో చూసేయండి!

New Update
Kids Health: ఈ ఫుడ్స్ పిల్లల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం!

బోర్న్‌విటా (Bournvita) హెల్త్ డ్రింక్ కాదని, దీంట్లో చెక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయని ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ తెలిపాడు. తర్వాత బోర్న్‌విటాతో పాటు ఇతర ప్రొడక్ట్స్‌ను హెల్త్ డ్రింక్స్ లిస్ట్ నుంచి తీసివేయాలని ఇ-కామర్స్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది.

నిజానికి ఇలాంటి చాక్లెట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ బేవరేజెస్ పిల్లలకు చాలా ప్రమాదకరం. అందుకే ఇటీవల వాణిజ్య మంత్రిత్వ శాఖ (Ministry of Commerce) ఈ డ్రింక్స్‌ను హెల్తీ డ్రింక్స్ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. వీటిలో చాలా ఎక్కువ చక్కెర, కృత్రిమ రంగులు, ఇతర హానికరమైన పదార్థాలు ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్ సిరియల్స్, గ్రానోలా బార్లు, ఫ్రూట్ జ్యూస్‌లు, ఫ్లేవర్డ్ యోగర్ట్‌లు వంటివి కూడా ఆరోగ్యకరమైనవి కాదు. ఈ ఆహారాలు పోషకాలతో సమృద్ధిగా ఉన్నాయని మార్కెటింగ్ చేస్తారు కానీ వాటిలో చాలా చక్కెర, ప్రాసెస్డ్‌ పదార్థాలు ఉన్నాయి.

ఈ ఆహారాలు పిల్లల బరువు పెరగడం, షుగర్ వ్యాధి, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే పిల్లలకు ఇంట్లో తయారుచేసిన ఆహారాలను అందించాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. గింజలు, నట్స్, పండ్లు, గోధుమ పిండి వంటి పదార్థాలతో తయారుచేసిన స్నాక్స్, టిఫిన్లు పిల్లలకు ఆరోగ్యకరమైనవి. పిల్లలకు ఇష్టమైన ఆహారాల్లోనే చక్కెర స్థాయిలు ఉండవచ్చని చెప్పారు గుర్గావ్‌లోని CK బిర్లా హాస్పిటల్‌లో పీడియాట్రిక్స్ & నియో నాటాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ సౌరభ్ ఖన్నా. హిందుస్తాన్ టైమ్స్‌కు ఈ వివరాలు వెల్లడించారు.

బ్రేక్‌ఫాస్ట్ సెరెల్స్‌: చక్కగా కనిపించే బొమ్మలు, రంగురంగులతో ఉండే బ్రేక్‌ఫాస్ట్ సెరెల్స్‌లో చాలా ఎక్కువ చక్కెర ఉంటుంది. ప్యాకెట్ల వెనక లేబుల్‌ని జాగ్రత్తగా చూసి తక్కువ చక్కెర ఉండేవి ఎంచుకోవాలి. లేదంటే హోల్-గ్రేయిన్ సెరెల్స్‌ ఇవ్వడం మంచిది.

ఫ్రూట్ జ్యూస్: ఫ్రూట్ జ్యూస్ ఆరోగ్యకరమైనది అనుకుంటాం, అయితే అందులో షుగర్ కంటెంట్ ఉంటుంది. పండ్లలో సహజ చక్కెరలే ఉంటాయి కానీ వాటిని ఎక్కువగా తాగితే మంచిది కాదు. అందుకే పండ్లు నేరుగా తినిపించాలి, జ్యూస్‌లు తక్కువ ఇవ్వాలి.

ప్యాకెట్ స్నాక్స్:పిల్లలకు ఇష్టమైన ప్యాకెట్ స్నాక్స్, ఫ్రూట్ స్నాక్స్, బిస్కెట్లలో చాలా ఎక్కువ చక్కెర దాగుండి ఉంటుంది. ప్యాకెట్లపై రాసి ఉండే పదార్థాల లిస్ట్ జాగ్రత్తగా చూసి, తక్కువ పదార్థాలు, తక్కువ చక్కెర ఉండేవి ఎంచుకోవాలి.

ఫ్లేవర్డ్ యోగర్ట్: యోగర్ట్ ఆరోగ్యకరమైన స్నాక్ అనుకుంటాం కదా కానీ ఫ్లేవర్డ్ యోగర్ట్‌లలో చాలా ఎక్కువ చక్కెర ఉంటుంది. పండ్ల ఫ్లేవర్‌తో ఉండే యోగర్ట్‌లు ఎక్కువ చక్కెర ఉండేవి కాబట్టి వాటిని వదిలేయండి. బదులుగా ప్లయిన్ యోగర్ట్‌కు తాజా పండ్లు ముక్కలు వేసి నేచురల్‌గా తీయ్యగా చేసుకోవచ్చు.

గ్రానోలా బార్స్:గ్రానోలా బార్స్‌లో చాలా ఎక్కువ షుగర్ ఉంటుంది. ముఖ్యంగా “హై-ఫ్రక్టోస్ కార్న్ సిరప్” వంటివి. ఇంట్లో చేసినవి లేదా తక్కువ చక్కెర, ఎక్కువ పోషకాలు ఉండే గ్రానోలా బార్స్‌ను ఎంచుకోవాలి.

కెచప్‌లు, సాసెస్‌లు:కెచప్, బార్బెక్యూ సాస్ వంటి వాటిలోనూ చాలా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. వాటి ప్యాకెట్లపై పదార్థాలు చూసి, నేచురల్ పదార్థాలు ఎక్కువగా ఉండేవి ఎంచుకోవాలి. లేదా ఇంట్లోనే ఆరోగ్యకరమైనవి తయారు చేసుకోవచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Omar Abdullah: పాక్‌ ప్రధానిపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. '' పహల్గాంలో చోటుచేసుకున్న దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదు.

Also read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఈ ఘటన వెనుక భారత్ ఉందని వాళ్లే మొదటగా ఆరోపించారు. మనపై ఎప్పుడూ ఆరోపణలు చేసేందుకు ముందుండే వాళ్లకు ఇప్పుడు మనమేమి చెప్పలేం. వాళ్లు చేసిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని'' సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.  

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

ఇదిలాఉండగా.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్‌ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్‌ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్‌ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్‌ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు.

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

telugu-news | rtv-news | national-news | Omar Abdullah 

Advertisment
Advertisment
Advertisment