Cricket: శ్రీలంకతో మొదటి వన్డే మ్యాచ్ టై

ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ టై గా ముగిసింది. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది.

New Update
Cricket: శ్రీలంకతో మొదటి వన్డే మ్యాచ్ టై

India Vs Sri lanka: టీ20 సీరీస్ అయిపోయింది...ఇప్పుడు శ్రీలంకతో వన్డే సీరీస్ మొదలయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్ టైగా ముగిసింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఎనిమిది వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. నిశాంక(56), దునీత్‌(67) అర్ధ సెంచరీలు చేశారు. ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌ చెరో 2 వికెట్లు తీశారు. సిరాజ్‌, దుబె, కుల్దీప్‌, సుందర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. తర్వాత 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ ఇండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బ్యాటర్లలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (58) టాప్‌ స్కోరర్‌. అక్షర్‌ పటేల్‌ (33), కేఎల్‌ రాహుల్‌ (31), శివమ్‌ దూబె(25), కోహ్లీ (24) పరుగులు చేశారు.

మ్యాచ్‌ను మలుపు తిప్పిన శ్రీలంక బౌలర్లు..

చివరి తొమ్మిది ఓవర్లు ఉన్నాయి అన్న పొజిషన్‌లో భారత్ చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి, 34 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో శివమ్ దూబే ఉన్నాడు. దాంతో టీమ్ ఇండియా ధీమాగా ఉంది. ఇలాంటి టైమ్‌లో 5 ఓవర్లు ఉండగా కులదీప్ అవుట్ అయ్యాడు. అప్పటికి భారత్ ఇంకా 18 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. తరువాత 47వ ఓవర్‌లో దూబె సిక్స్‌ కొట్టడంతోపాటు మొత్తం 10 పరుగులు వచ్చాయి. ఇంకేటి భారత్ గెలిచేసింది అనుకున్నారు అందరూ. ఆ తర్వాతి ఓవర్‌ మూడో బంతికి దూబె ఫోర్‌ కొట్టడంతో స్కోర్‌ సమమైంది. దీంతో టీమ్‌ఇండియా సంబరాల్లో మునిగింది. కరెక్ట్‌గా ఈ సమయంలో లంక అసలంక మాయ చేశాడు. వరుస బంతుల్లో దూబె, అర్ష్‌దీప్‌ను ఎల్బీగా ఔట్‌ చేశాడు. దీంతో భారత్‌ విజయం ముంగిట బోల్తా పడి టైగా ముగించాల్సి వచ్చింది. శ్రీలంక బౌలర్లలో అసలంక, హసరంగా తలో మూడు వికెట్లు తీయగా, వెల్లలాగే 2, ధనంజయ, ఫెర్నాండో ఒక్కో వికెట్‌ తీశారు.

Also Read: USA: డెమోక్రటిక్ అభ్యర్ధిగా కమలా హారిస్ ఖరారు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment