Thailand: ఆసియాలోకి ఎంటర్ అయిన మంకీ పాక్స్..

కాంగోలో బీభత్సం సృష్టిస్తున్న మంకీ పాక్స్ వైరస్ చాలా వేగంగా ఇతర దేశాలకూ పాకుతోంది. తాజాగా ఇప్పుడు ఈ వైరస్ ఆసియాలో కూడా ప్రవేశించింది. తమ దేశంలో మొదటి మంకీ పాక్స్ కేసు నమోదయిందని థాయ్ లాండ్ ప్రభుత్వం ప్రకటించింది.

New Update
Thailand: ఆసియాలోకి ఎంటర్ అయిన మంకీ పాక్స్..

Monkeypox: ఆఫ్రికా దేశం కాంగోలో మొదలైన మంకీపాక్స్ నెమ్మదిగా తీవ్ర రూపం దాల్చుతోంది. ఆఫ్రికాలో 12 దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ ఐరోపా దేశాలకు ఇప్పుడు ఆసియాలోనూ ప్రవేశించింది. తమ దేశంలో మొదటి కేసు నమోదయిందని థాయ్ లాండ్ ప్రభుత్వం ధృవీకరించింది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి ఆఫ్రికా నుంచే వచ్చారని తెలిపింది. ఆగస్టు 14న వచ్చిన అతనికి ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అతన్ని పరీక్షించి Mpox, క్లాడ్ 1B అనే స్ట్రెయిన్ నిర్ధారించారు.

ఆఫ్రికా బయట ఇప్పటికి మూడు దేశాల్లో ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఆఫ్రికా వెలుపల స్వీడన్ లో మంకీ పాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇక మన పొరుగుదేశం పాకిస్థాన్ లో మూడు మంకీ పాక్స్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ వ్యాప్తి చెందిన తర్వాత, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రెండేళ్లలో రెండవ సారి ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అది ఇప్పుడు ఇతర దేశాలకు వ్యాపించిందని WHO తెలిపింది. వ్యాధి గ్రస్తులతో దగ్గర సంబంధాల ద్వారా వ్యాపించే Mpox, సాధారణంగా తేలికపాటిది కానీ అరుదైన సందర్భాల్లో మరణానికి దారితీయవచ్చు. వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తి చర్మంపై ఫ్లూ వంటి లక్షణాలు,  చీముతో నిండిన గాయాలు కనిపిస్తాయి.

కాంగోలో వ్యాప్తి ప్రారంభంలో స్థానిక క్లాడ్ I జాతికి సంబంధించినది. ఇప్పుడు ఎంపాక్స్ వైరస్‌కు ఒక కొత్త రూపాంతరం, క్లాడ్ Ib వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్ బురుండి, కెన్యా, రువాండా,  ఉగాండాలకు వ్యాపించింది. దీంతో WHO గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. "తూర్పు DRCలో కొత్త క్లాడ్ పాక్స్‌ను గుర్తించడం అది వేగంగా వ్యాప్తి చెందడం జరుగుతోంది.  ఇంతకుముందు mpoxని రిపోర్ట్ చేయని పొరుగు దేశాలకు కూడా ఇది వ్యాప్తి చెందడం అలాగే, ఆఫ్రికాలో, వెలుపల మరింత వ్యాప్తి చెందే అవకాశం చాలా ఆందోళన కలిగిస్తుంది" అని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్  తెలిపారు.

Also Read:  Supreme Court: కోల్‌కతా డాక్టర్ కేసులో ప్రిన్సిపల్ పాత్రపై సుప్రీంకోర్టు అనుమానాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పుతిన్..!

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ దాడిలో దాడాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

New Update
putin

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మిని స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌లు స్పందిస్తూ.. తీవ్రంగా ఖండించారు. అలాగే, భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు. పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఉగ్రదాడిలో దాదాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.

Also Read:Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!

పహల్గాం ఉగ్రదాడిపై స్పందించిన  ట్రంప్.. ఈ ఉగ్రదాడి తనను తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. ‘కశ్మీర్ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. దాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. .గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని ట్రంప్  ట్రూత్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

అటు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించారు. ‘ఈ క్రూరమైన నేరాన్ని సహించేది లేదు. ఈ దాడి వెనకున్న ఎంతటివారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని ఆశిస్తున్నా. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌తో మా సహకారాన్ని మరింత పెంచుకోవడానికి ఎదురుచూస్తున్నాం. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నా" అని పుతిన్ అన్నారు.

భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు కూడా ఈ దాడి గురించి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిని వినాశకర ఉగ్ర దాడిగా అభివర్ణించారు. ‘భారత్‌లోని పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనపై బాధిత కుటుంబాలకు నేను, ఉషా సంతాపం తెలుపుతున్నాం... కొన్ని రోజులుగా మేం ఈ దేశం అందాలు, భారతీయుల అభిమానానికి ఎంతో ముగ్దులయ్యాం.. ఈ భయానక దాడితో చనిపోయివారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తున్నాం’ ఈ మేరకు ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌పై వాన్స్ స్పందించారు.

కశ్మీర్ ఘటనపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. ‘జాతీయ భద్రతా సలహాదారు ద్వారా సమాచారం అందింది. దీనిపై ఎప్పటికప్పుడు అధ్యక్షుడికి సమాచారం అందిస్తున్నాం.. ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం.. దక్షిణ కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతంలో జరిగిన భయానక ఉగ్రదాడిలో 28 మంది  చనిపోగా.. మరో 20 మంది తీవ్రంగా  గాయపడ్డారు. అధ్యక్షుడు ట్రంప్ తక్షణమే ప్రధాని మోదీతో మాట్లాడి ప్రాణాలు కోల్పోయినవారికి తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తారు.

 బాధితులకు, మా మిత్రదేశమైన భారత్‌కు మేము మద్దతుగా నిలుస్తాం.. ఇలాంటి భయానక ఉగ్రవాద దాడులే ప్రపంచంలో శాంతి, స్థిరత కోసం పనిచేస్తున్న మేమందరం మా కృషిని కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి..." అని పేర్కొన్నారు.

జమ్మూ అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలోని బైసరన్‌ లోయలో విహారయాత్రకు వచ్చిన పర్యాటకులే లక్ష్యంగా పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు నిర్వహించే లష్కరే తొయిబా అనుబంధ విభాగం ది రెసిస్టెంట్ ఫ్రంట్ దాడికి పాల్పడింది. ఈ ఈ ఘటనలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇదేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. ఈ ఘటనతో కశ్మీర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read: Ap: ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఆయనేనా?

Also Read: J&K TerrorAttack: పహల్గాం ఉగ్రదాడి.. ఇద్దరు ఏపీ వాసులు మృతి !

trump | putin | russia | america | Pahalgam attack | latest-news

Advertisment
Advertisment
Advertisment