Telangana: వానల గురించి వాతావరణశాఖ కీలక అప్‌డేట్‌...ఎప్పటి వరకు కురుస్తాయంటే!

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం, బుధవారం వరకు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు పడతాయని అధికారులు తెలిపారు.

New Update
Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..!

Telangana Rains Update: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం, బుధవారం వరకు కూడా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష

మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగ్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాపాతం నమోదైంది. మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు