telugu girl died in USA:అమెరికాలో తెలుగు అమ్మాయిని మింగేసిన రాకాసి అల

అమెరికాలో వాషింగ్టన్ స్టేట్ లో హైదరాబాద్ కు చెందిన తెలుగు అమ్మాయి శ్వేత చిరుమామిళ్ళ మృతి చెందారు. అక్కడి రియాల్టో బీచ్ లో సరదాగ గడపడానికి వెళ్ళిన శ్వేతను రాకాసి అల పొట్టనపెట్టుకుంది.

New Update
telugu girl died in USA:అమెరికాలో తెలుగు అమ్మాయిని మింగేసిన రాకాసి అల

అమెరికాలో తెలగు అమ్మాయి గల్లంతయింది. వాషింగ్టన్ స్టేట్ లో ఉంటున్న శ్వేత చిరుమామిళ్ళ సముద్రపు అలకు బలి అయింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో ఆమె ఏకంగా ప్రాణాలనే పోగొట్టుకోవలసి వచ్చింది. ఒలింపిక్ నార్త్ వెస్ట్ పెనిసులాలో ఉన్న రియాల్టో బీచ్ కు శ్వేత తన ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా వెళ్ళింది. అక్కడ సముద్రంలో ఆడుకుంటుండగా ఒక పెద్ద రాకాసి అల వచ్చి వారందరినీ ముంచేసింది. అక్కడితో ఆగకుండా శ్వేతను తనతో పాటూ తీసుకుని వెళ్ళిపోయింది కూడా. శ్వేత చిరుమామిళ్ళ వయసు 26. హైదరాబాద్ కు చెందిన తెలుగు అమ్మాయి.

swetha, usa

శ్వేత గురించి తమకు సమాచారం సెప్టెంబర్ 25 సోమవారం ఉదయం 10.50కి అందింది అని చెబుతున్నారు యూఎస్ కోస్ట్ గార్డ్స్. తర్వాత అక్కడి నుంచి ఆమె కోసం సముద్రంలో 5 గంటల పాటూ వెతికారు. హెలికాఫ్టర్లు, ల్యాండ్ సెర్చ్ కూడా చేశారు. కానీ శ్వేత ఆచూకీ మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో ఆమె మతదేహాన్ని గుర్తించగలిగారు. సెర్చ్ ఆపరేషన్ చాలా కష్టమైందని... బుధవారమంతా వెదర్ కండిషన్స్ అస్సలు బాగోలేదని చెబుతున్నారు కోస్ట్ గార్డ్స్.

అమెరికాలో శ్వేత సియాటెల్ లో ఉంటుందో అని తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయి ఏం చేస్తోంది, ఏం చదువుతోంది... అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే హైదరాబాద్ లో శ్వేత తల్లిదండ్రులు ఎవరు ఎక్కడ ఉంటారు అన్న వివరాలు కూడా ఇంకా బయటకు రాలేదు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Melinda Gates: బిల్‌గేట్స్‌తో అందుకే విడిపోయా.. మెలిందా గేట్స్‌ కీలక వ్యాఖ్యలు

బిల్‌గేట్స్‌తో విడాకులపై ఆయన మాజీ భార్య మెలిందా గేట్స్ స్పందించారు. మీ బంధాన్ని కాపాడుకునేందుకు కావాల్సిన విలువలను మీరు నిలబెట్టుకోకపోతే విడాకులు అవసరమేనని అన్నారు. విడిపోయినప్పుడు తాను భయాందోళనకు గురైనట్లు చెప్పారు.

New Update
Melinda Gates Opens Up About Her Divorce

Melinda Gates Opens Up About Her Divorce

మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్, మెలిందా గేట్స్‌ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ మెలిందాతో విడాకులు బాధాకరమైన విషయమని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా మెలిందా స్పందించారు. పరిస్థితులు అలా ఉండటం వల్లే తాము బంధానికి ముగింపు పలికామని చెప్పారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. 

Also Read: మైనర్ బాలికకు గర్భం.. పోక్సో కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు!
  
 మీ బంధాన్ని కాపాడుకునేందుకు కావాల్సిన విలువలను మీరు నిలబెట్టుకోకపోతే విడాకులు అవసరమేనని మెలిందా గేట్స్ అన్నారు. విడిపోవడం అనేది చాలా కష్టమైన విషయమని.. ఆ సమయంలో తాను ఎంతో భయాందోళనకు గురయ్యాయని గుర్తుచేసుకున్నారు. కానీ ఆ తర్వాత తన జీవితం ఆనందంగా సాగిపోతుందని తెలిపారు. ఇదిలాఉండగా సోర్స్ కోడ్ పేరుతో బిల్‌గేట్స్‌ ఇటీవల ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెలిందాతో తన విడాకులు చాలా బాధకరమైనవని అన్నారు. 

Also Read: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

దాదాపు 30 ఏళ్ల తర్వాత పెళ్లి బంధానికి స్వస్థి పలుకుతూ బిల్‌గేట్స్‌, మెలిందా గేట్స్ 2021లో విడాకులు తీసుకున్నారు. వీళ్లకు 20 ఏళ్లకు పైబడిన ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌ అధినేతలుగా కాకుండా వివిధ ధార్మిక కార్యక్రమాల ద్వారా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ బిల్‌గేట్స్‌ దంపతులు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విడాకులకు కారణాలు పూర్తిగా తెలియకపోయినప్పటికీ.. లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్ సంబంధాలు మెలిందాకు నచ్చలేదని.. అందుకే వారు విడిపోయినట్లు ఓ ప్రముఖ పత్రిక అప్పట్లో ఓ కథనంలో వెల్లడించింది. 

Also Read: అయ్యప్ప భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఆన్‌లైన్‌లో బంగారు లాకెట్లు.. ఇలా బుక్ చేసుకోండి!

bill-gates | divorce | rtv-news | melinda-gates 

Advertisment
Advertisment
Advertisment