Telangana: మెట్రోను స్వాధీనం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 100 శాతం షేర్లను కొనుగోలు చేసింది.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 100 శాతం షేర్లను కొనుగోలు చేసింది.
తెలంగాణ పదో తరగతి (SSC) విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కేశవరావు అధికారికంగా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను వాట్సాప్ , అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోండి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో బుధవారం ఉదయం దొంగనోట్ల కలకలం రేగింది. లచ్చాపురం గ్రామ శివారులోని కొర్రాజుల చెరువు సమీపంలో పెద్ద ఎత్తున రూ. 500 ల నకిలీ నోట్లు చెల్లాచెదురుగా పడి ఉండటం కలకలం రేపింది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరును ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నాలుగేళ్ల క్రితం మే 6న రాహుల్ గాంధీ వరంగల్లో ఇచ్చిన హామీలు, జరిగిన మోసాలను గుర్తు చేసేలా.. అదే రోజున వరంగల్ లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది.
సినీ నటి అషురెడ్డి అలియాస్ కె. వెంకట అశ్విని రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో ధర్మేంద్రకు అషురెడ్డి పంపినట్లు చెబుతున్న ఒక ఆడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.
తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న పరీక్షా ఫలితాల విడుదలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. (ఈ రోజు) ఏప్రిల్ 29వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫలితాలు అధికారికంగా విడుదల కానున్నాయి.
కన్నప్రేమ కరువైందో.. లేక కసి పెరిగిందో తెలియదు కానీ, తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ సాక్షిగా ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే.. తమ ఇద్దరు చిన్నారులను పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టి, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం G.O.Rt.No. 553 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
విశ్వాసానికి మారుపేరైన శునకాలపై మనుషులు అమానవీయంగా ప్రవర్తిస్తున్న ఉదంతం హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. మూగజీవాల రక్తాన్ని వ్యాపారంగా మార్చుకుంటూ, వాటి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉదంతం నగరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.