BIG BREAKING: భయ్యా సన్నీ యాదవ్‌కు బిగ్ షాక్.. లుక్ ఔట్ నోటీసులు జారీ

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో భయ్యా సన్నీయాదవ్‌పై ఇప్పటికే నూతనకల్ పీఎస్‌లో కేసునమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా అతడికి బిగ్‌షాక్ తగిలింది. సన్నీయాదవ్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే అతడిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.

New Update
YouTuber bayya Sunny Yadav lookout notice by Police for betting app case

YouTuber bayya Sunny Yadav lookout notice by Police for betting app case

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో భయ్యా సన్నీయాదవ్‌పై ఇప్పటికే నూతనకల్ పీఎస్‌లో కేసునమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా అతడికి బిగ్‌షాక్ తగిలింది. సన్నీయాదవ్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే అతడిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. 

మైనంపల్లి ఫిర్యాదు

మరోవైపు ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్‌ ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ వ్యవహారంలో ఉండి ఇప్పటి వరకు కేసులు కాని వాళ్లకు బిగ్ షాక్ తగలనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి.. ఇంకా కేసు కాకుండా ఉన్న వారిపై పోలీసులు కేసులు పెట్టనున్నారు. ఇందులో భాగంగానే మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు నేరెడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?

బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వాళ్లు.. ఎంత పెద్దవారైనా వదలొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినయ్ కుయ్యా, శివజ్యోతి, డేర్‌స్టార్‌ గోపాల్‌, శ్రీధర్ చాప, విజ్జుగౌడ్‌పై కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ బెట్టింగ్ యాప్స్ కాంట్రవర్సీ ఎంతవరకు వెళ్తుందో.

ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన సెలబ్రెటీలకు తెలంగాణ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల యాంకర్ విష్ణుప్రియతో పాటు మొత్తం 11 మంది సెలబ్రెటీలకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో సైతం కేసులు నమోదు అయ్యాయి.

11 గంటల పాటు విచారణ

టాలీవుడ్ సినీ హీరో, హీరోయిన్లపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ తన లాయర్‌తో కలిసి పంజాగుట్ట పీఎస్ కు విచారణకు హాజరయ్యారు. ముఖం కనిపించకుండా తలకు స్కార్ఫ్ తో విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. దాదాపు 11 గంటల పాటు విష్ణుప్రియను పోలీసులు విచారించారు. 

Also Read: కర్నూలులో దారుణ హత్య. వేట కొడవళ్లతో వెంబడించి.. షాకింగ్ వీడియో!

ఈ విచారణలో ఆమె బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశానని ఒప్పుకున్నారు. 3 యాప్స్‌కు తాను ప్రమోషన్స్ చేశానని విచారణలో చెప్పుకొచ్చారు. దీంతో 25వ తేదీన పోలీసులు మరోసారి విచారణకు హాజరుకావాలని చెప్పారు. విచారణ అనంతరం బయటకొచ్చిన విష్ణుప్రియ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

అన్నింటికి సమాధానం

ఈ మేరకు తన ఇన్‌స్టాలో సంచలన పోస్టు పెట్టారు. అందులో ‘‘Only Time Can Answer.. Only Patience Till Then’’ (కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది.. అప్పటి వరకు ఓపికతో ఉండాలి) అంటూ ఆ స్టోరీలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై నెటిజన్లు కంగుతిన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment