Telangana Women Commission: కాసోజు శంకరమ్మకు రేవంత్ కీలక పదవి.. మాజీ మేయర్ విజయలక్ష్మికీ గుడ్ న్యూస్!

తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్‌లో మరో కీలక సభ్యురాలిగా తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు అవకాశం వచ్చింది.

New Update
vijayalaxmi appointed as women commission chairman and Kasoju shankaramma appointed as Member

vijayalaxmi appointed as women commission chairman and Kasoju shankaramma appointed as Member

Telangana Women Commission: తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్‌లో మరో కీలక సభ్యురాలిగా తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు అవకాశం వచ్చింది. సామాజిక సమీకరణాలు, ఉద్యమ నేపథ్యం ఉన్నవాళ్లకి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్ పదవీకాలం అయిదేళ్ల పాటు కొనసాగనుంది.

Also Read: నోరు జారిందా..? కావాలనే అన్నాడా? కమెడియన్ సప్తగిరిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్!

2014 అసెంబ్లీ ఎన్నికల్లో శంకరమ్మను బీఆర్ఎస్‌ పార్టీ (అప్పుడు TRS) హుజుర్‌నగర్‌ నుంచి బరిలోకి దింపింది. కానీ కాంగ్రెస్ నేత ఉత్తమ్‌ కుమార్ రెడ్డి చేతిలో ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత 2018లో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకుంది. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా అవకాశం ఇవ్వడంపై నెటిజన్లు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.  

Advertisment
తాజా కథనాలు