మరికొన్ని గంటల్లో గ్రూప్-1 పరీక్ష.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సంచలన లేఖ

సోమవారం నుంచి గ్రూప్-1 పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు. పంతాలు, పట్టింపులకు పోకుండా 29 జీవోను ఉపసంహరించుకోవాలని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కోరారు.

New Update
Bandi sanjay

సోమవారం నుంచి గ్రూప్-1 పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు. పంతాలు, పట్టింపులకు పోకుండా 29 జీవోను ఉపసంహరించుకోవాలని తెలిపారు. '' రేపు పరీక్షలని తెలిసి కూడా ఈరోజు ఆందోళనను కొనసాగిస్తున్నారంటే అర్థం చేసుకోండి. నిరుద్యోగులంతా మీ కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆవేదనను అర్థం చేసుకోండి. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయండి. 29జీవో వల్ల గ్రూప్ 1 పరీక్షల్లో 5003 మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులు అనర్హలయ్యారు. 563 పోస్టులకు గుండుగుత్తగా 1:50 చొప్పున అభ్యర్థులను ప్రకటించడం అన్యాయం. ఈ మొత్తం పోస్టుల్లో 354 రిజర్వ్ పోస్టులు ఉన్నాయి. 29 జీవో వల్ల ఓపెన్ కేటగిరిలో అర్హత సాధించిన రిజర్వ్ అభ్యర్థులను సైతం రిజర్వ్ కేటగిరీలో చేర్చడం అన్యాయం. 

Also Read: వణికిస్తున్న బాంబు బెదిరింపులు.. ఎయిర్ లైన్స్‌కి ఎంత నష్టమంటే?

ఈ జీవోవల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు 1:50 చొప్పున అర్హత సాధిస్తే.. ఓసీ వర్గాలు 1:65 శాతం మేరకు అర్హత సాధించారు. జీవో నెంబర్ 29 రాజ్యాంగ స్పూర్తికి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు వ్యతిరేకం. గ్రూప్ 1 అభ్యర్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు. 29 జీవో వల్ల రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేయబోతున్నారనే చర్చ మొదలైంది. తక్షణమే 29 జీవోను ఉపసంహరించుకోవాలని'' బండి సంజయ్ కోరారు. 

Also Read: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..

ఇదిలాఉండగా అక్టోబర్ 21 అంటే సోమవారం నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసందే. ఈ పరీక్షలను వాయిదా వేయాలని ఇటీవల గ్రూప్‌ 1 అభ్యర్థులు అశోక్‌ నగర్, అలాగే సచివాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్రూప్-1 పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించలేదని.. జీవో 29ను రద్దు చేసి పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పరీక్షలు వాయిదా వేయడం కుదరని చెప్పేశారు. యథావిధిగా పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. 

Also Read: బయటపడ్డ మరో బాబా రాసలీలలు.. వీడియో వైరల్

వివాదం ఏంటీ 

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు జీవో 55ను తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ఒక ఉద్యోగానికి రిజర్వేషన్ సహా అన్ని కేటగిరీల నుంచి 50 మందిని ఎంపిక చేస్తారు. మిగతా రిజర్వుడ్ పోస్టులకు ఆయా అభ్యర్థులకే అవకాశం కల్పిస్తారు. రిజర్వుడ్ అభ్యర్థులకు వారి కోటాతోపాటు ఓపెన్ కోటాలోనూ ఉద్యోగం పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీవో 29ను తీసుకొచ్చింది. 

జీవో 29 ప్రకారం ఓపెన్ కోటాలో రిజర్వుడ్ అభ్యర్థులకు ఉద్యోగం పొందే అవకాశం ఉండదు. మెరిట్ ర్యాంకు వచ్చినా కూడా ఈ కోటాలో ఛాన్స్ ఉండదు. కేవలం రిజర్వుడు కోటాలో మాత్రమే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జీవో వల్ల ఇలా రిజర్వుడు అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం లభించే అవకాశం లేకపోవడం.. కేవలం రిజర్వుడు కోటా మాత్రమే ఉండటం వల్ల కాస్త తక్కువ ర్యాంకు వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. అందుకే జీవో 29ను రద్దు చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు

New Update
BRS meeting

BRS meeting

KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

 కాంగ్రెస్ ను తిరస్కరించండి


‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

 నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్


ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

Advertisment
Advertisment
Advertisment