TS: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణలో 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఉట్నూరు ఏఎస్పీగా కాజల్, ఆసిఫాబాద్‌ ఏఎస్పీగా ఎస్‌. చిత్తరంజన్‌ ను నియమించారు. 

New Update
CM Revanth Reddy: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్‌ జీతాలకు నిధులు విడుదల

తెలంగాణలో కామారెడ్డి, ఆసిఫాబాద్, భద్రాచలంతో పాటూ మరి కొన్ని ప్రాంతాల ఐపీఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన పలువురు ఐపీఎస్‌లను ట్రాన్సఫర్ చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. మొత్తం తొమ్మిది జిల్లాల ఎస్సీలను బదిలీ చేశారు.

బదిలీ అయిన అధికారులు... 

ఉట్నూరు ఏఎస్పీగా కాజల్ 
ఆసిఫాబాద్‌ ఏఎస్పీగా ఎస్‌. చిత్తరంజన్‌
కామారెడ్డి ఏఎస్పీగా బి.చైతన్యరెడ్డి
జనగామ ఏఎస్పీగా పి.చేతన్ నితిన్
భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్
కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా ఎన్.శుభం ప్రకాష్
నిర్మల్ ఏఎస్పీగా రాజేష్ మీనా
దేవరకొండ ఏఎస్పీగా పి.మౌనిక
భువనగిరి ఏఎస్పీగా కంకణాల రాహుల్ రెడ్డి‌

Also read: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, ప్రయోగం వాయిదా.. ఇస్రో కీలక ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment