Crime News: తెలంగాణలో దారుణం.. ప్రియుడి మోజులో భర్తను భార్య ఎలా చంపిందంటే.. !

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన భార్య కట్టుకున్న భర్తను కడతేర్చింది. ప్రియుడు సహా మరోముగ్గురితో కలసి భర్తను హత్య చేయించింది. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు.

New Update
Wife Killing Husband With Boyfriend telangana Sangareddy.

Wife Killing Husband With Boyfriend telangana Sangareddy.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. సీడ్ ఫ్యాక్టరీలో ఇన్‌చార్జిగా పనిచేస్తున్న మాలే నారాయణ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని గోనెసంచిలో మూటగట్టి హత్నూర మండలం పల్పానూర్ గ్రామ శివారులో పడేశారు. ఈ ఘటన జరిగి రెండు మూడు రోజులు కావడంతో మృతదేహం నుంచి విపరీతమైన దుర్వాసన రావడం మొదలైంది. 

దీంతో అటువైపుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వివరాలు సేకరించారు. చనిపోయిన వ్యక్తి కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మల్లు పల్లి గ్రామానికి చెందిన మాలే నారాయణగా పోలీసులు గుర్తించారు. 

ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

ప్లాన్ ప్రకారమే భర్త హత్య

అతడు గత కొన్నాళ్ల క్రితం సంగారెడ్డికి ఉపాధి కోసం వలసవచ్చి సీడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. మృతుని భార్యకు వివాహేతర సంబంధం ఉన్న కారణంగా నారాయణ హత్య జరిగినట్లు సమాచారం. ప్రియుడి మోజులో పడిన భార్య ప్లాన్ ప్రకారమే తన భర్తను హత్య చేయించినట్లు తెలుస్తోంది. ప్రియుడు మరో ముగ్గురితో కలసి ఆమె తన భర్తను చంపించినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి:  Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

పోలీసుల అదుపు నిందితులు

ఈ వ్యవహారమంతా జరిగిన తర్వాత మృతుని భార్య మూడు రోజుల క్రితం హత్నూర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తన భర్త మిస్ అయ్యాడని కేసు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి భార్య లక్ష్మితో పాటు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నలుగురి వ్యక్తులను సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే మృతునికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Hyderabad Police Sent Notices To Pakistani Nationals

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment