TG Crime: తెలంగాణలో మరో దారుణం.. తల్లిని చంపిన కూతురు!

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం 300 క్వార్టర్‌లో భర్తతో కలిసి కన్నతల్లిని చంపింది ఓ కూతురు. తల్లి వారి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆమెపై కక్ష పెంచుకుంది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో గొంతు నులిమి చంపేశారు కూతురు సౌందర్య, అల్లుడు రమేష్.

New Update
 mother Killed nizamabad

Nizamabad crime

TG Crime: తల్లిదండ్రులు పిల్లల క్షేమాన్ని కోరుకుంటారు. ఈ రోజులలో తల్లిదండ్రులను ప్రేమను అర్థం చేసుకునే సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొందరైతే డబ్బు, ప్రేమ వ్యామోహాలలో పడి తల్లిదండ్రులను కూడా హతరుస్తున్నారు. మరి కొందరైతే.. కుటుంబ వ్యవహారాలలో కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. కంటికి రెప్పలా కాపాడవలసిన కూతురు తల్లిని కడ తెర్చింది. ఘటన తెలంగాణలో కలకలం రేపింది.

కసాయి కూతురు..

వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం 300 క్వార్టర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతో కలిసి కన్నతల్లిని చంపింది ఓ కూతురు. తల్లి వారి కుటుంబ వ్యవహారాల్లో  జోక్యం చేసుకుంటుందని ఆమెపై కక్ష పెంచుకుంది. తల్లి విజయని ఎలాగైనా చంపాలని ఫ్లాన్‌తో.. గాఢ నిద్రలో ఉన్న సమయంలో గొంతు నులిమి చంపేశారు కూతురు సౌందర్య, అల్లుడు రమేష్. అనంతరం.. అనారోగ్యంతో మృతి చెందినట్లు కట్టు కథ చెప్పి అందరిని నమ్మించే ప్రయత్నం చేశారు.  గొంతుపై గాయాలు ఉండటం గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు భార్య భర్తలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.  ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: కొబ్బరి పాలు చేసే అద్భుతాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు

తల్లిదండ్రుల విషయంలో ఇలాంటి  ఘోరాలు రోజు రోజుకు సమాజంలో పెరిగిపోతున్నాయి. డబ్బు, ప్రేమ, కుటుంబ వ్యవహారాలలో జోక్యం చేసుకున్నారని చంపటం ఎంతో దారుణం. తల్లిదండ్రులు పిల్లల సంతోషంగా ఉండటం కోసం ఆలోచిస్తారు. రక్తం పంచుకుని పుట్టిన వాళ్లు.. వాళ్లను ఎంతో ప్రేమగా సూచుకోవాలి. కానీ కేవలం డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. తాజాగా.. కన్న తల్లినే హత్య చేసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.

ఇది కూడా చదవండి: ప్యాక్‌ చేసినవి తింటే మిమ్మల్ని ప్యాక్‌ చేయాల్సిందే.. గుర్తుంచుకోండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు