హైదరాబాద్‌కు AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ముందున్న సవాళ్లు ఇవే..!

తెలంగాణ నూతన AICC ఇన్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మీనాక్షి నటరాజన్‌కు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్‌ గౌడ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

author-image
By K Mohan
New Update
AICC menakshi natarajan

AICC menakshi natarajan Photograph: (AICC menakshi natarajan)

తెలంగాణ నూతన AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. సింపుల్‌గా ఎలాంటి హంగామా లేకుండా కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మీనాక్షి నటరాజన్‌కు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ నాయకులు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్‌ గౌడ్ ఆమెకు స్వాగతం పలికారు. హైదరాబాద్ రాగానే ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. దీపా దాస్ మున్షీ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా గత కొన్ని రోజుల క్రితమే మీనాక్షి నటరాజన్‌ని ప్రకటించింది అధిష్టానం. 

Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నాటరాజన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. గతకొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వర్గ విభేదాలు వస్తున్నాయి. పార్టీలో ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్, మంత్రులపై అధిష్టానానికి ఫిర్యాదులు చర్ఛనీయాంశంగా మారాయి. అంతేకాదు ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి ఎక్కువైతున్నా.. మంత్రివర్గ విస్తరణ కూడా జరగలేదు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత కూడా ఆమె పైనే ఉంది. స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందు ప్రజల్లో తెలంగాణ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేఖత ఆమెకు పెద్ద పరీక్షగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సరైన నిర్ణయాలు మీనాక్షి నటరాజన్ తీసుకోవాలి. అధికార కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం ధీటుగా ఎదుర్కోంటుంది. మంత్రుల మధ్య సంఖ్యత కూడా లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Butta Renuka: వైసీపీకి భారీ షాక్... మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎల్‌ఐసీ హౌసింగ్‌ సంస్థ నుంచి రూ.360 కోట్లు తీసుకొని చెల్లించలేదు. దీంతో అప్పుకోసం తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేయనున్నట్లు ఎల్‌ఐసీ ప్రకటించింది.దీర్ఘకాలంగా బకాయిలు చెల్లించనందునే ఆస్తులు వేలం వేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

New Update
Butta Renuka

Butta Renuka

Butta Renuka: వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎల్‌ఐసీ హౌసింగ్‌ సంస్థ నుంచి దాదాపు రూ.360 కోట్ల రుణం తీసుకొని బురిడీ కొట్టేశారు. దీంతో అప్పు కోసం బుట్టా రేణుక దంపతులు తనఖా పెట్టిన ఆస్తులను  వేలం వేయనున్నట్లు ఎల్‌ఐసీ ప్రకటించింది. దీర్ఘకాలంగా బకాయిలు చెల్లించనందునే ఆస్తులు వేలం వేస్తున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. బుట్టా దంపతులు దాదాపు రూ.360 కోట్లను రెండు రుణ ఖాతాల ద్వారా తీసుకున్నారు. ఈ రుణానికి 2019 నవంబరు 18న బుట్టా రేణుక, బీఎస్‌ నీలకంఠకు డిమాండ్‌ నోటీసు పంపింది. ఈ ఆస్తుల రిజర్వు ధరను రూ.360 కోట్లుగా ఎల్‌ఐసీ హౌసింగ్‌ పేర్కొంది. ఈ ఆస్తులన్నింటినీ ఏకమొత్తంలో ఈ-వేలం ద్వారా విక్రయిస్తామని పేర్కొంది.

Also Read :  మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

తీసుకున్న రుణానికి కొంతకాలంపాటు కిస్తీలు సక్రమంగా చెల్లించినప్పటికీ ఐదేళ్ల నుంచి తిరిగి చెల్లించడం లేదు. ఇప్పటికే సంస్థ బెంగళూరు బ్రాంచి ప్రతినిధులు పలుసార్లు నోటీసులు పంపడంతోపాటు సంప్రదింపులు జరిపినప్పటికీ బుట్టా దంపతులు స్పందించలేదు. బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠలు 2018లో 15ఏళ్ల కాలవ్యవధిలో తిరిగి చెల్లించేలా రూ.310 కోట్ల రుణం తీసుకున్నారు. బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్, మెరిడియన్‌ ఎడ్యుటెక్‌ సర్వీసెస్‌ కార్యకలాపాలకు రుణాన్ని వినియోగించారు. రుణంపై సుమారు రూ.40 కోట్ల వరకు చెల్లించారు. అసలు, వడ్డీ కలిపి ఇంకా రూ.340 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. వడ్డీ భారం ఎక్కువగా ఉన్నందున కొన్ని ఆస్తులు విక్రయించి రుణం రీషెడ్యూలు చేయాలని వారు కోరారు.

Also Read :  ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

కరోనా మహమ్మారి సమయంలో బుట్టా రేణుకకు సంబంధించిన పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కొన్నింటిని మూసివేయాల్సి వచ్చింది. ఇక ఆ ప్రభావం బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు బుట్టా రేణుకకు సంబంధించిన ఇతర సంస్థల పైన కూడా పడింది. దీంతో బకాయిలు పేరుకుపోవడంతో తిరిగి చెల్లించని నేపథ్యంలో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే బకాయిల చెల్లింపు అంశంపై బుట్టా రేణుక నేషనల్ కంపెనీలా ట్రిబ్యునల్ లో అప్పీల్ చేసుకున్నారు. ఎన్సీఎల్టీలో కేసు ఉండగా వేలం ప్రకటన వేయడం నిబంధనలకు విరుద్ధమని బుట్టా రేణుక వాదిస్తున్నా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మాత్రం అదేమీ పట్టించుకోవటం లేదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వెళ్తుంది.

Also Read :  నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..

నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపాదన ఉందని హెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రతినిధులు అంగీకరించలేదు. రుణం తీసుకున్న మొత్తానికి నెలసరి వాయిదా రూ.3.40 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం భారంగా మారినందున తొలుత తక్కువ మొత్తం తీసుకుని, చెల్లింపు మొత్తాన్ని క్రమేణా పెంచాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదననూ హెచ్‌ఎఫ్‌ఎల్‌ తిరస్కరించింది. రుణాలు చెల్లించడం ఆపేసినందున హెచ్‌ఎఫ్‌ఎల్‌.. ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉంది. రుణ నిబంధనలకు అనుగుణంగా బుట్టా రేణుక దంపతులకు చెందిన బంజారాహిల్స్‌లోని ఐదువేల గజాల ఆస్తిని రూ.145 కోట్లకు వేలం వేయగా ఎవరూ ముందుకు రాలేదు. మాదాపూర్‌లోని 7,205 చ.గజాల్లో ఉన్న బుట్టా కన్వెన్షన్‌ వేలానికీ స్పందన రాలేదు. మరోసారి వేలానికీ ప్రయత్నిస్తున్నారు. వేలంలో పాడుకుంటే ఇబ్బందులు వస్తాయోనని చాలామంది వెనకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read :  టీచర్ కాదు టార్చర్.. హోం వర్క్ చేయలేదని విద్యార్థినితో దారుణం.. లేడీ టీచర్‌కు రూ.2 లక్షల జరిమానా!

 
 

Advertisment
Advertisment
Advertisment