TG Inter Exams: ఎల్లుండి నుంచే తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్.. లేట్ అయినా ఓకే.. ఈ సారి కొత్త రూల్స్ ఇవే!

తెలంగాణ ఇంటర్ పరీక్షలు మార్చి5 నుంచి మొదలుకానున్నాయి. ఈ క్రమంలో కీలక ప్రకటన రిలీజైంది. పరీక్ష ప్రారంభమయ్యే 15నిమిషాల ముందు గేట్లు మూసేస్తారన్న నిబంధనను కచ్చితంగా పాటించడం లేదని తెలిపారు. పరీక్షా కేంద్రానికి 5నిమిషాలు లేటు వచ్చినా పర్వాలేదని పేర్కొన్నారు.

New Update
telangana inter public exams starts from march 5

telangana inter public exams starts from march 5

ఏపీలో ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైపోయాయి. మార్చి 1వ తేదీ నుంచి ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా మొదలైయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 5వ తేదీ అంటే ఎల్లుండి నుంచే ఈ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక ప్రకటన రిలీజ్ చేసింది. 

Also Read :  టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్

కొత్త రూల్స్

ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను రిలీజ్ చేసింది. అందులో పరీక్ష ప్రారంభం అయ్యే 15 నిమిషాల ముందుగానే గేట్లు మూసేస్తారని నిబంధన ఉంది. అయితే ఆ నిబంధనను కచ్చితంగా అమలు చేయడం లేదని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఇప్పటి వరకు పరీక్ష ప్రారంభమై ఒక్క నిమిషం అయినా స్టూడెంట్స్‌ను పరీక్షకు అనుమతించేవారు కాదు. కానీ ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ (5నిమిషాలు లేటు వచ్చినా పర్వాలేదు) ఇస్తున్నట్లు వెల్లడించారు. 

Also read :  SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..

telangana inter public exams starts from march 5 .
telangana inter public exams starts from march 5 .)

 

అలాగే పరీక్షా కేంద్రాల వద్ద BNS 163 అమలులో ఉంటుందని కూడా చెప్పారు. ఇక ప్రతీ పరీక్షా కేంద్రాలలో మూడు సీసీ కెమెరాలు పెట్టినట్లు తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కు ఈ పరీక్షలు మార్చి 5న ప్రారంభమై మార్చి 25 వరకు జరుగుతాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,532 కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 9,96,541 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందులో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 4,88,316 మంది, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 5,08,225 మంది ఉన్నారు. 

Also Read: Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Thatikonda vs Kadiyam : కడియం టాల్ లీడర్ కాదు, ఫాల్ లీడర్...మాజీ మంత్రి రాజయ్య సంచలనవ్యాఖ్యలు

స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంపై కడియం చేసిన ఆరోపణలకు తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు.

New Update
 Thatikonda Rajaiah vs kadiyam srihari

Thatikonda Rajaiah vs kadiyam srihari

 Thatikonda vs Kadiyam : స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు. ఆయ‌న మీడియాతో మాట్లడుతూ.. కడియం శ్రీహరీ నీది నాలికా తాటి మట్టా..? తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీచ సంస్కృతి నీది.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మీద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. నువ్వు అన్నం తింటున్నవా..గడ్డి తింటున్నావా.. పదేళ్లు ఆ కుటుంబంలో అంతరంగికుడిగా ఉన్నావ్ కదా.. కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావ్.. ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి.. లేకపోతే నిన్ను బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరగనివ్వరు అని హెచ్చరించారు. న‌మ్మక‌ద్రోహానికి ప్రతిరూపం నువ్వు.. నీ ప్రవర్తన.. నీ ద్రోహాన్ని చూసి కాంగ్రెస్ వాళ్లు కూడా ఉమ్మేస్తున్నారు.1994 కు ముందు నీ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? అని ప్రశ్నించారు. 30 ఏళ్లలో ఎలా కుబేరుడు అయ్యావు.. నీ ఇళ్ళు, దేవునూరు భూములు, పెట్రోల్ బంకులే నీ అవినీతికి సాక్ష్యం అన్నారు.. విదేశాలలో నీ ఆస్తులే సాక్ష్యం..ఇంకొకసారి నీతి, నిజాయితీ గురించి మాట్లాడవద్దు అని మండిప‌డ్డారు.

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

ఇంకా ఆయన మాట్లాడుతూ, “చనిపోయిన పాము కొస తోకకు ప్రాణం ఉన్నట్టు కడియం రాజకీయం ఉండేది ” అంటూ ఘాటుగా స్పందించారు. కడియం శ్రీహరికి రాజకీయ జన్మ ఇవ్వడంలో ముందుగా కేసీఆర్ పాత్ర ఉందని, రెండోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ లభించిందని రాజయ్య పేర్కొన్నారు.అలాగే, స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పాత్రను ప్రస్తావిస్తూ, “వేడినీళ్లకు చన్నీళ్ల లాగా రాజేశ్వర్ రెడ్డి వ్యవహరించారు. అభివృద్ధి విషయాల్లో ఆయన పాత్ర ఘణనీయమైంది” అని అన్నారు. కేసీఆర్ మాటల్లో ఎప్పుడూ కడియం పేరు రాలేదని, అయినప్పటికీ ఆయన తన స్థాయిని మరిచి ప్రెస్ మీట్‌లో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఇక కడియం శ్రీహరి పాలన గురించి మాట్లాడుతూ, “ఇప్పుడిది ప్రజాస్వామ్యం కాదు, అక్రమ అరెస్టులతో ఒక వర్గానికి అనుకూలంగా పాలన సాగుతోంది. ప్రజల స్వేచ్ఛలు హరించబడుతున్నాయి” అని ఆరోపించారు.అంతేకాకుండా… “రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలకు జీవితాంతం గులామ్‌గిరి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది” అంటూ రాజయ్య హెచ్చరించారు. ఆయన కడియంపై ఆస్తుల విషయమై కూడా ఆరోపణలు చేశారు. “దేవనూరు పరిసర ప్రాంతాల్లో బినామీ పేర్లతో భూములు ఉన్నాయా? కుటుంబంతో కలిసి పాలేరు ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నావా?” అంటూ ప్రశ్నలు సంధించారు.మొత్తం 23 మంది రైతులకు చెందిన 43 ఎకరాల 38 గుంటల భూమిని బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని పేర్కొంటూ, “ఇది వాస్తవం కాదా?” అంటూ రాజయ్య నిలదీశారు. చివరగా, “నీవు టాల్ లీడర్ (ఎత్తైన నాయకుడు) కాదు, ఫాల్ లీడర్ (పడిపోయే నాయకుడు)” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

Also read :  Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

Advertisment
Advertisment
Advertisment