TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అందువల్ల విద్యార్థులు పరీక్షలకు ముందు తప్పక తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో కొత్త సబ్జెక్ట్‌లను ఇప్పటికిప్పుడు చదవకూడదు. ముందుగా ఎగ్జామ్ సెంటర్ అండ్ రూమ్ నెంబర్ తెలుసుకోవాలి.

New Update
Telangana Inter exams students Things must know

Telangana Inter exams students Things must know

తెలంగాణ ఇంటర్ పరీక్షలు మార్చి5 నుంచి మొదలుకానున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ప్రారంభమయ్యే 15నిమిషాల ముందు గేట్లు మూసేస్తారన్న నిబంధనను కచ్చితంగా పాటించడం లేదని అధికారులు తెలిపారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రానికి 5నిమిషాలు లేటు వచ్చినా పర్వాలేదని పేర్కొన్నారు. ఇక పరీక్షలకు రెండు రోజులే సమయం ఉండటంతో విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని  విషయాలు చూసేద్దాం.

Also Read :  టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్

ఇవి తప్పక తెలుసుకోండి

విద్యార్థులు పరీక్షలకు ముందు తెగ బట్టీ పట్టి చదివి బుర్రపాడు చేసుకోకూడదు.

ఇప్పటి వరకు ప్రాక్టీస్ అయిన వాటినే మరోసారి చెక్ చేసుకోవాలి. 

కొత్త సబ్జెక్ట్‌లను ఇప్పటికిప్పుడు చదవేయాలని అనుకోవద్దు. 

ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవాలి.

పరీక్షా కేంద్రాలను ఒకరోజు ముందుగానే చెక్ చేసుకోవాలి. 

ఎల్లుండి పరీక్ష ప్రారంభం అనగా.. రేపు పరీక్షా సెంటర్‌కు వెళ్లాలి. 

ఒకరోజు ముందుగానే ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లి మీ రూమ్ నెంబర్, మీ ప్లేస్ చెక్ చేసుకోవాలి. 

Also read : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..

ఇక పరీక్ష ముందురోజు బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్ అని తెగ తినేకూడదు. అలా చేస్తే పొట్ట చెడిపోయే ప్రమాదం

ఉంటుంది. దీంతో పరీక్షకు వెళ్లే సమయంలో గజిబిజిగా ఉండొచ్చు. 

పరీక్ష రోజు కూడా తక్కువ ఆహారం తీసుకోవాలి. టిఫిన్ చేసి వెళ్లినా పర్వాలేదు.

ఇక పరీక్ష రోజు తొందర తొందర పడకూడదు. అలా తొందర పడేకొద్ది హాల్ టికెట్ సహా పరీక్షకు కావలసిన పరికరాలు మర్చిపోయే అవకాశం ఉంటుంది.

విద్యార్థులు తమ హాల్ టికెట్‌తో పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలి. 

పరీక్ష ప్రారంభమయ్యే అరగంట ముందు అంటే 9 గంటలకు పరీక్ష స్టార్ట్ కానుండగా.. 8.30కి పరీక్షా కేంద్రాల వద్ద ఉండాలి. 

సెంటర్‌ లోపలకి వెళ్లిన తర్వాత మళ్లీ రివిజన్ చేసుకోకూడదు. చాలా కూల్‌గా ఉండాలి. 

క్వచ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ముందుగా మీకు వచ్చిన.. గుర్తున్న ఆన్సర్లను రాసేయాలి. 

ఆ తర్వాత మెల్లి మెల్లిగా ఒక్కో క్వచ్చన్ ‌ను ఒకటికి రెండు సార్లు చదివితే గుర్తుకు వస్తాయి. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

New Update
Rains

Rains

 Rain Alert : ఒకవైపు ఎండలు మండుతుంటే మరోవైపు వరుణుడు కూడా తన సత్తా చాటుతున్నాడు. పొద్దంతా ఎండలు రాత్రి వర్షాలు అన్నట్లు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

Also read: KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా

నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉందని, ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. తర్వాత దిశను మార్చుకొని ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి.. రాగల 24గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనంగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.


 ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

ఈ క్రమంలో మంగళవారం ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. 11న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Also read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

Advertisment
Advertisment
Advertisment