TG News: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి!

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరం చల్లబడింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కూడన్పల్లి సమీపంలో ఇద్దరు వ్యవసాయ కూలీలు పిడుగుపాటుకు గురై మృతిచెందారు.

New Update
ap rains

ap rains

TG News: తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్, ఉమ్మడి, నిజామాబాద్, హైదరాబాద్, నాగర్ కర్నూల్, వికారాబాద్ పలు చోట్ల  ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. అకాల వర్షాల కారణంగా రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Also Read: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!

పిడుగుపాటుకు ఇద్దరు మృతి 

ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం కూడన్పల్లి గ్రామ సమీపంలో.. పొలంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు పిడుగుపాటుకు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో రైతులు, కూలీలు చెట్ల కింద ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  మరో రెండు రోజుల వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. క్యుములోనింబన్ మేఘాల ప్రభావం కారణంగా వానలు పడుతున్నట్లు తెలిపింది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు వర్షం పడే సూచన ఉంది. 

Also Read: మళ్లీ తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్

40 కి మీ నుంచి 50 కి

ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు ఉంటాయి. గంటకు 40 కి మీ నుండి 50 కి. మీ వేగం కలిగిన ఈదురుగాలులు  వీస్తాయి. వడగళ్లతో కూడిన వర్షాలు చాలాచోట్ల  కురిసే అవకాశం ఉంది. అలాగే శనివారం..  రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో  ఉరుములు మెరుపులు ఉంటాయి. గంటకు 30 నుంచి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లో అబ్సిగూడ, బేగంబజార్, నాంపల్లి, సికింద్రాబాద్, బంజారాహిల్స్ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.  

telugu-news | latest-news | heavy-rains | telangana

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Wine Shops Closed: మందుబాబులకు షాకింగ్​ న్యూస్.. వైన్​షాపులు, కల్లు దుకాణాలు బంద్- ఎప్పుడంటే!

మందు బాబులకు బ్యాడ్​ న్యూస్. హైదరాబాద్​లో వైన్​షాపులు, కళ్లు దుకాణాలు, బార్‌లు బంద్ కానున్నాయి.​ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12 ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు అన్ని షాపులు మూసివేయాలని నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

New Update
Wine Shops

wine shops closed in hyderabad

మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. మరొక్క రోజు ఆగితే.. మద్యం దుకాణాలన్నీ మూతపడనున్నాయి. ఒక్క మద్యం షాపులు మాత్రమే కాకుండా.. కళ్లు దుకాణాలు కూడా మూసేస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే. ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా నగర కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి

Wine Shops Closed in Hyderabad

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

హనుమాన్ జయంతి రోజున హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వైన్ షాపులు అన్నీ క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 12 వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలతో పాటు కల్లు షాప్‌లు, బార్‌లు కూడా మూసివేయాలని తెలిపారు. 

ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు

ఈ ఆదేశాలు జంటనగరాల్లో అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కావున ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా హనుమాన్ జయంతి ఉత్సవాన్ని ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని తెలిపారు. కాగా ఇటీవల జరిగిన శ్రీరామ నవమి సందర్భంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా వైన్​షాపులను మూసేసిన విషయం తెలిసిందే. 

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

(wine-shops-closed | wine-shops-closed-in-telangana | wine-shops | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు