Telangana Liquor Price: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు.. ఎంతంటే?

తెలంగాణలో మందుబాబులకు షాక్ తగలనుంది. మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రీమియం బ్రాండ్స్, బీర్లపై 15% ధరలు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నుంచి ఈ ధరలను పెంచాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

New Update
telangana government liquor price increase soon considers 15 percentage

telangana government liquor price increase soon considers 15 percentage

తెలంగాణలో మందుబాబులకు గట్టి షాక్ తగలనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపు ధరలను వచ్చే నెల అంటే ఫిబ్రవరి నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ ఇప్పటికే కసరత్తు కంప్లీట్ చేసినట్లు సమాచారం. 

Also Read :  నరకం లాంటి జైల్లో వలసదారుల్ని వేస్తాం: ట్రంప్‌!

ఈ మేరకు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. ఆ నివేదికలో మద్యం ధరలు పెంచాలంటూ పేర్కొన్నట్లు సమాచారం. వచ్చే నెల ఫిబ్రవరి నుంచి మద్యం ధరలను పెంచాలని ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు బ్రాండెడ్ మద్యం, బ్రాండెడ్ బీర్లు, చీప్ లిక్కర్ ధరలు పెంచాలని త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. 

Also Read :  అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్

15 శాతం వరకు పెరిగే ఛాన్స్

ఇదే అంశంపై గత నాలుగైదు రోజులుగా ఎక్సైజ్ అధికారులు సచివాలయంలో సమావేశమై చర్చించినట్లు తెలిసింది. ఇందులో ప్రీమియం బ్రాండ్స్ అలాగే బీర్లపై దాదాపు 15 శాతం వరకు ధరలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక చీప్ లిక్కర్ రేట్లను మాత్రం తక్కువ శాతం పెంచాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. 

Also Read :  తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Hyderabad Police Sent Notices To Pakistani Nationals

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment