TG News: ప్లాట్ల రిజిస్ట్రేషన్ పై రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. భారీ డిస్కౌంట్!

తెలంగాణ ప్రభుత్వం గత 4ఏళ్లుగా రిజిస్ట్రేషన్‌ కాని ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌లో రాయితీ కల్పించింది. మార్చి 31లోగా 25శాతం డిస్కౌంట్‌తో ప్లాట్ల రిజిస్ట్రేషన్ నేరుగా సబ్ రిజిస్ట్రర్ ఆఫీస్‌లోనే అవకాశం కల్పించింది. LRS పథకం అమలులో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది.

New Update
Telangana LRS: ఎల్ఆర్ఎస్ కు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలివే!

తెలంగాణ సర్కార్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. LRS పథకం అమలులో భాగంగా ప్లాట్ల రిజిస్టేషన్‌కు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు LRS ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనుంది. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లోనే 25శాతం డిస్కౌంట్‌పోగా మిగిలిన ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారిలతో బుధవారం ఈ అంశంపై సమావేశం నిర్వహించారు. LRS పథకం అమలును వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు.

Also Read :  రేప్‌లు చేసి బయటకొచ్చి.. మళ్లీ రేప్ చేశాడు... చివరకు కుంభమేళాకు వెళ్తుండగా

Also Read :  ఒంటరితనం భయంకరంగా ఉందట.. రెండో పెళ్లిపై హింట్ ఇచ్చిన సమంత

Revanth Reddy About Plot Registration

మార్చి 31లోగా ఈ రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. అనుమతి లేని లే అవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై గత ప్రభుత్వం నిషేదం విధించిన విషయం తెలిసిందే. దీంతో వాటిని కొనుగోలు చేసిన వారికి నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. వారికి ప్రస్తుత ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ.. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు వెసులు బాటు కల్పించింది. వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పెండింగ్‌ ఉన్న వారితోపాటు.. లే అవుట్ల విక్రమం కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన ప్లాట్లకు కూడా క్రమబద్దీకరణ పథకం అమలయ్యేలా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ప్లాట్లు కొనుగోలు చేసిన వారు డ్యాకుమెంట్స్ ఉంటే మార్చి 31లోగా 25శాతం రాయితీతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపింది ప్రభుత్వం.

Also read :కేసీఆర్ పై కేసు వేసిన వ్యక్తి మర్డర్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

Also Read :  ఢిల్లీ కొత్త సీఎం సంచలన నిర్ణయం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు!

తెలంగాణ టెన్త్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. గ్రేడింగ్‌ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసింది. దీంతో మెమోల ముద్రణ ఎలా ఉండాలనే దానిపై స్పష్టత రావట్లేదట. అది తేలితేనే ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. 

New Update
tg 10th

TG 10th Results: తెలంగాణ టెన్త్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. గ్రేడింగ్‌ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసింది. దీంతో మెమోల ముద్రణ ఎలా ఉండాలనే దానిపై స్పష్టత రావట్లేదట. అది తేలితేనే ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. 

రేవంత్ సర్కార్ GO జారీ..

ఈ మేరకు గత ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన గ్రేడింగ్‌ విధానానికి స్వస్తి చెప్పి మార్కులు ఇవ్వాలని రేవంత్ సర్కార్ GO జారీ చేసింది. అయితే మార్కులకు సంబంధించిన మెమోల ముద్రణపై ఇప్పటికే మంతనాలు జరపగా దీనిపై తుది నిర్ణయం వెలువడలేదట. దీంతో మెమోల జారీ అశం తేలితేనే రిజల్ట్స్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం కూడా  పూర్తి కాగా.. ఏప్రిల్ చివరి వారం వరకు ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారట. ఈ లోగా ప్రభుత్వం నుంచి మెమోలా అంశంపై స్పష్టమైన ప్రకటన రాకపోతే మరింత ఆలస్యం అవుతుందని, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. 

NCERT ప్రతిపాదన..

ఇదిలా ఉంటే.. గతంలో మోమోలపై ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి, ఫెయిల్‌ అని రాసేవారు. కానీ ఇప్పుడు పాస్, ఫెయిల్‌ అని ఇస్తే చాలని NCERT సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ప్రథమ మార్కులు సాధించినవారిని ప్రోత్సహించేలా ఫస్ట్, సెకండ్, థర్డ్‌ క్లాస్‌ అని ఇవ్వాలని, 35 మార్కుల కన్నా తగ్గితే ఫెయిల్‌ అని రాయాలని ప్రభుత్వానికి ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు ప్రతిపాదించారట. దీనిపై నెల గడుస్తున్నా ప్రభుత్వం జవాబు ఇవ్వకపోవడతో NCERT అధికారులు సచివాలయానికి వెళ్లి విద్యాశాఖ అధికారులను ఆరా తీసినట్లు సమాచారం. 

Also read :  Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

మరోవైపు గ్రేడింగ్‌ విధానమే కొనసాగించాలని డిమాండ్ వినిపిస్తున్నాయి. మార్కులు ప్రవేశపెడితే ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తామని ట్రస్మా తరఫున వినతిపత్రాలు అందినట్లు యాదగిరి శేఖర్‌రావు తెలపడం చర్చనీయాంశమైంది. కానీ 10వ  తరగతి గ్రేడింగ్‌ విధానం 2024 నవంబరులోనే ప్రభుత్వం ఎత్తివేసింది. ఇంటర్నల్ 20 మార్కులు ఉంటాయని తెలిపింది. కానీ ఇంటర్నల్ మార్క్స్ తొలగిస్తే ఫలితాల్లో మార్కులు తగ్గే అవకాశం ఉందని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. 

Also read :  TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

10th-class-results | telangana | memo | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment